Political News

నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్ ఆదేశాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా త‌న దైన ముద్ర వేస్తున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా తీసుకున్న మ‌రో నిర్ణ‌యం కూడా అంత‌కంటే ఎక్కువ సంచ‌ల‌నంగా మారింది. ముఖ్యంగా కీల‌క నాయ‌కులు, ప్ర‌ధానంగా సీఎం స‌హా మంత్రులు వ‌స్తున్నారంటే.. ట్రాఫిక్ క‌ష్టాలు మామూలుగా ఉండ‌డం లేదు. హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో అయితే.. గంట‌ల‌కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక‌, సామాన్య ప్ర‌జ‌లు ఆఫీసుల‌కు వెళ్లే స‌మ‌యంలోనో.. త‌మ పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు పంపించే స‌మ‌యంలోనో సీఎం వంటి నాయ‌కుడు బ‌య‌ట‌కు వ‌స్తే.. ఇక‌, వారు ఆశ‌లు వ‌దులుకునే ప‌రిస్థితి నెల‌కొంది.

సీఎం సార్ వ‌స్తున్నారంటూ.. గంటల కొద్దీ ట్రాఫిక్‌ను ఆపేయ‌డం రివాజుగా మారింది. ఏపీలోనూ ఇలాంటి ప‌రిస్తితి మ‌రింత దారుణంగా ఉంది. పైన హెలికాప్ట‌ర్‌లో సీఎం జ‌గ‌న్ వెళ్తున్నా.. కింద రోడ్డుమీద జ‌నాల‌ను ఆపేస్తున్న ప‌రిస్థితి తెలిసిందే. దీనివ‌ల్ల సామాన్యులు నానా తిప్ప‌లుప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ నూత‌న ముఖ్య‌మంత్రి రేవంత్ రెండ్డి సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. త‌ను వ‌చ్చేస‌మ‌యంలో కేవ‌లం 5 లేదా 10 నిమిషాల ముందు మాత్ర‌మే ట్రాఫిక్‌ను ఆపాలని సూచించారు. అంతేకాదు.. సీఎం కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తన కాన్వాయ్‌ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్‌ నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు. దీని వల్ల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మినహాయింపులు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. సీఎం కాన్వాయ్‌లోని 15 వాహనాలను 9వాహనాలకు తగ్గించామని, తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌లు, ట్రాఫిక్‌ నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుందన్నారు.

ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీసు అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ట్రాఫిక్ నిబంధనల విషయంలో కాస్త వెసులు బాటు కల్పించేందుకు వీలుగా తీసుకునే చర్యలపై పోలీసులు ఆలోచిస్తున్నారు. సీఎం కాన్వాయ్ బయల్దేరే కొద్ది సేపటి ముందు వరకు వాహనాల రాకపోకలు యథావిధిగా అనుమతించాలని భావిస్తున్నారు. ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు సీఎం సూచనలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

This post was last modified on December 16, 2023 8:22 am

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

11 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

15 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago