జనసేన పార్టీకి సంబంధించి గురువారం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు నియమితుడు కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బన్నీ వాసు పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు.. జనసేన పార్టీ సానుభూతిపరుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అతను ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా బన్నీ వాసు నియమితుడు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
పార్టీలో ముందు నుంచి యాక్టివ్ గా ఉన్న రెగ్యులర్ పొలిటికల్ లీడర్లను కాకుండా.. బన్నీ వాసుకు ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది.
సినిమాల పరంగానే కాక రాజకీయాల విషయంలోనూ బన్నీ వాసు దగ్గర మంచి మార్కెటింగ్ స్ట్రాటజీలు ఉన్నట్లు సమాచారం. అతడికి పొలిటికల్ అడ్వర్టైజింగ్ లో ఇప్పటికే అనుభవం ఉంది. గతంలో మారుతితో కలిసి ప్రజారాజ్యం కోసం ఈ పని చేశాడు. అలాగే వాసుకి మంచి పిఆర్ బలం కూడా ఉంది. సంప్రదాయ శైలికి భిన్నంగా.. యువతను బాగా అట్రాక్ట్ చేసేలా క్యాంపెనింగ్ ఐడియాలతో బన్నీ వాసు టీం ఇంప్రెస్ చేసినట్టు సమాచారం.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించినట్లే క్రియేటివ్, స్ట్రైకింగ్ యాడ్స్ తో పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికార వైఎస్ఆర్సిపి వైఫల్యాలను ఎత్తి చూపేలా క్యాంపెనింగ్ నడిపించేందుకు బన్నీ వాసు టీం పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు సమాచారం. బన్నీ వాసు చేతుల్లోకి జనసేన ఎన్నికల ప్రచార కమిటీ వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆ పార్టీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది.
This post was last modified on December 15, 2023 4:10 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…