జనసేన పార్టీకి సంబంధించి గురువారం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు నియమితుడు కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బన్నీ వాసు పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు.. జనసేన పార్టీ సానుభూతిపరుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అతను ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా బన్నీ వాసు నియమితుడు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
పార్టీలో ముందు నుంచి యాక్టివ్ గా ఉన్న రెగ్యులర్ పొలిటికల్ లీడర్లను కాకుండా.. బన్నీ వాసుకు ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది.
సినిమాల పరంగానే కాక రాజకీయాల విషయంలోనూ బన్నీ వాసు దగ్గర మంచి మార్కెటింగ్ స్ట్రాటజీలు ఉన్నట్లు సమాచారం. అతడికి పొలిటికల్ అడ్వర్టైజింగ్ లో ఇప్పటికే అనుభవం ఉంది. గతంలో మారుతితో కలిసి ప్రజారాజ్యం కోసం ఈ పని చేశాడు. అలాగే వాసుకి మంచి పిఆర్ బలం కూడా ఉంది. సంప్రదాయ శైలికి భిన్నంగా.. యువతను బాగా అట్రాక్ట్ చేసేలా క్యాంపెనింగ్ ఐడియాలతో బన్నీ వాసు టీం ఇంప్రెస్ చేసినట్టు సమాచారం.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించినట్లే క్రియేటివ్, స్ట్రైకింగ్ యాడ్స్ తో పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికార వైఎస్ఆర్సిపి వైఫల్యాలను ఎత్తి చూపేలా క్యాంపెనింగ్ నడిపించేందుకు బన్నీ వాసు టీం పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు సమాచారం. బన్నీ వాసు చేతుల్లోకి జనసేన ఎన్నికల ప్రచార కమిటీ వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆ పార్టీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది.
This post was last modified on December 15, 2023 4:10 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…