జనసేన పార్టీకి సంబంధించి గురువారం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు నియమితుడు కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బన్నీ వాసు పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు.. జనసేన పార్టీ సానుభూతిపరుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అతను ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా బన్నీ వాసు నియమితుడు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
పార్టీలో ముందు నుంచి యాక్టివ్ గా ఉన్న రెగ్యులర్ పొలిటికల్ లీడర్లను కాకుండా.. బన్నీ వాసుకు ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది.
సినిమాల పరంగానే కాక రాజకీయాల విషయంలోనూ బన్నీ వాసు దగ్గర మంచి మార్కెటింగ్ స్ట్రాటజీలు ఉన్నట్లు సమాచారం. అతడికి పొలిటికల్ అడ్వర్టైజింగ్ లో ఇప్పటికే అనుభవం ఉంది. గతంలో మారుతితో కలిసి ప్రజారాజ్యం కోసం ఈ పని చేశాడు. అలాగే వాసుకి మంచి పిఆర్ బలం కూడా ఉంది. సంప్రదాయ శైలికి భిన్నంగా.. యువతను బాగా అట్రాక్ట్ చేసేలా క్యాంపెనింగ్ ఐడియాలతో బన్నీ వాసు టీం ఇంప్రెస్ చేసినట్టు సమాచారం.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించినట్లే క్రియేటివ్, స్ట్రైకింగ్ యాడ్స్ తో పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికార వైఎస్ఆర్సిపి వైఫల్యాలను ఎత్తి చూపేలా క్యాంపెనింగ్ నడిపించేందుకు బన్నీ వాసు టీం పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు సమాచారం. బన్నీ వాసు చేతుల్లోకి జనసేన ఎన్నికల ప్రచార కమిటీ వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆ పార్టీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది.
This post was last modified on December 15, 2023 4:10 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…