Political News

పవర్ పాయింటుకు రెడీ అవుతున్నారా ?

పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అప్పులపై అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి రేవంత్ వివిధ శాఖల పనితీరుపై సమీక్షలు చేస్తున్నారు. ఇందులో కూడా రెవిన్యు, ఫైనాన్స్ శాఖల ప్రభావం ఎక్కువగా ఉన్న శాఖలపైనే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే విద్యుత్ శాఖ, ధరణి పోర్టల్ ను నిర్వహించే ఆర్ధికశాఖ, పరిశ్రమల్లాంటివి కీలకంగా ఉన్నాయి.

ఈ సమీక్షల్లోనే విద్యుత్ శాఖ అప్పులు రు. 85 వేల కోట్లున్నట్లు బయటపడింది. తన పాలనలో విద్యుత్ శాఖ అప్పులపై కేసీయార్ ఎప్పుడూ ప్రకటించింది లేదు. అలాగే ధరణి పోర్టల్లో నాలుగు రోజుల్లో వందల ఎకరాల అక్రమాలు బయటపడ్డాయి. అంటే పోర్టల్ ను అమల్లోకి తెచ్చిన దగ్గర నుండి ఇంకెన్ని వేల ఎకరాల్లో అక్రమాలు జరిగాయో అన్న విషయమై సమీక్షలు చేస్తున్నారు. ఇలాంటి అనేక శాఖల్లో జరిగిన అవకతవకలను రేవంత్ ప్రభుత్వం గుర్తిస్తోంది.

ఇలాంటి శాఖలపై సమీక్షలు పూర్తి చేసిన వెంటనే ఆ మొత్తాన్ని అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ వేదికగానే రాష్ట్రం అప్పులు, ఆదాయాలపై సవివరమైన నివేదికను జనాలకు వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా కేసీయార్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఆర్ధిక దుబారాపైనే ఎక్కువగా రేవంత్ దృష్టిపెట్టారు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీయార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే ఇపుడు రేవంత్ అప్పులు, వాస్తవ పరిస్ధితిపైన ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారు.

ఈనెల 14వ తేదీన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ బాధ్యత మొత్తాన్ని చీఫ్ సెక్రటరి శాంతికుమారికి అప్పగించినట్లు సమాచారం. అందుకనే చీఫ్ సెక్రటరీ రేవంత్ ఆదేశించిన శాఖల ఉన్నతాధికారులతో సమావేశాలు జరుపుతున్నారు. కేసీయార్ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రేవంత్ అండ్ కో ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాన్నే అసెంబ్లీలో అందరిముందు వివరించబోతున్నారు.

This post was last modified on December 12, 2023 11:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

2 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

2 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

3 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

3 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

4 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

6 hours ago