“పార్టీని విలీనం చేస్తానని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో కలిసి ఉన్నానన్నది ఎంత నిజమో.. పార్టీని విలీనం చేయబోననేది అంతే నిజం. మళ్లీ మళ్లీ చెబుతున్నా.. పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు. 2014లో పోటీ చేయకుండా మద్దతు తెలిపాం. 2019లో ఒంటరిగానే బరిలో నిలిచి పోరాడాం. ఓడిపోయాం. అయినా.. పార్టీని నిలబెట్టుకున్నాం. ఇప్పుడు కూడా అంతే. మరోసారి ఓడిపోయినా.. పార్టీని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదు” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించా రు.
తాజాగా విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని.. ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పని చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. మార్పు కోసం ఓట్లు కావాలని పవన్ వెల్లడించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా.. తనకు బాధ అనిపించలేదని.. కానీ వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఓడిపోతుంటేనే బాధనిపిస్తోందని అన్నారు.
“అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం ఓట్లు అడుగుతా. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల.. అందరినీ ఆహ్వానించే నేల. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి.. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలి. కష్టం వస్తే ఆదుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నా. పదవుల కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నా” అని అన్నారు.
This post was last modified on December 7, 2023 11:18 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…