Political News

మ‌రోసారి ఓడినా.. పార్టీని విలీనం చేయ‌ను: ప‌వ‌న్‌

“పార్టీని విలీనం చేస్తాన‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. బీజేపీతో క‌లిసి ఉన్నాన‌న్న‌ది ఎంత నిజ‌మో.. పార్టీని విలీనం చేయ‌బోన‌నేది అంతే నిజం. మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా.. పార్టీని విలీనం చేసే ప్ర‌స‌క్తే లేదు. 2014లో పోటీ చేయ‌కుండా మ‌ద్ద‌తు తెలిపాం. 2019లో ఒంట‌రిగానే బ‌రిలో నిలిచి పోరాడాం. ఓడిపోయాం. అయినా.. పార్టీని నిల‌బెట్టుకున్నాం. ఇప్పుడు కూడా అంతే. మ‌రోసారి ఓడిపోయినా.. పార్టీని మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ విలీనం చేసే ప్ర‌సక్తే లేదు” అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించా రు.

తాజాగా విశాఖ‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని.. ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పని చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. మార్పు కోసం ఓట్లు కావాలని పవన్‌ వెల్లడించారు. గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్ల ఓడిపోయినా.. త‌న‌కు బాధ అనిపించ‌లేద‌ని.. కానీ వైసీపీ పాల‌న‌లో ప్ర‌జాస్వామ్యం ఓడిపోతుంటేనే బాధ‌నిపిస్తోంద‌ని అన్నారు.

“అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం ఓట్లు అడుగుతా. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల.. అందరినీ ఆహ్వానించే నేల. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి.. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలి. కష్టం వస్తే ఆదుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నా. పదవుల కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నా” అని అన్నారు.

Satya

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

1 hour ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

2 hours ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

3 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

4 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

4 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

4 hours ago