తెలంగాణ ముఖ్యమంత్రిగా తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన.. రేవంత్రెడ్డి విషయంలో నందమూరి కుటుంబం హ్యాపీగా స్పందించింది. ఆయన పదికాలాల పాటు తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు నడిపించాలని నందమూరి ఫ్యామిలీ అభిలషించింది. ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబం సందేశం పంపించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కొత్తగా ప్రమణస్వీకారం చేసిన మంత్రులకు నందమూరి రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి నియామకం పట్ల తనకు చాల సంతోషంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని విజయవంతంగా కొనసాగిస్తారని నందమూరి రామకృష్ణ వెల్లడించారు. తెలంగాణ కేబినెట్ మంత్రులకు పేరు పేరున అభినందనలు తెలియచేస్తున్నానని నందమూరి రామకృష్ణ చెప్పారు. ఇక, అమెరికాలో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులుకూడా రేవంత్కు శుభాకాంక్షలు తెలిపారని రామకృష్ణ పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ సీఎంగా బాద్యతలు చేపట్టిన రేవంత్రెడ్డికి టీడీపీ అధినేత, రేవంత్ కు రాజకీయ గురువుగా పేర్కొనే మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో రేవంత్రెడ్డి ప్రజలకు సుపారిపాలన అందించాలని చంద్రబాబు ఆకాక్షించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం వెంటనే చంద్రబాబు.. ఎక్స్ వేదికగా స్పందించారు.
అదేవిధంగా నారా లోకేష్ కూడా రేవంత్కు శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి చంద్రబాబును రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అయితే.. అనివార్య కారణాలతో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో ఎక్స్ వేదికగా రేవంత్ను అభినందించారు. మరోవైపు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కూడా.. రేవంత్కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా పరస్పరం సహకరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
This post was last modified on December 7, 2023 7:46 pm
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…
వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…
``సనాతన ధర్మ బోర్డును సాధ్యమైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి…
గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…