తెలంగాణ ముఖ్యమంత్రిగా తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన.. రేవంత్రెడ్డి విషయంలో నందమూరి కుటుంబం హ్యాపీగా స్పందించింది. ఆయన పదికాలాల పాటు తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు నడిపించాలని నందమూరి ఫ్యామిలీ అభిలషించింది. ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబం సందేశం పంపించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కొత్తగా ప్రమణస్వీకారం చేసిన మంత్రులకు నందమూరి రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి నియామకం పట్ల తనకు చాల సంతోషంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని విజయవంతంగా కొనసాగిస్తారని నందమూరి రామకృష్ణ వెల్లడించారు. తెలంగాణ కేబినెట్ మంత్రులకు పేరు పేరున అభినందనలు తెలియచేస్తున్నానని నందమూరి రామకృష్ణ చెప్పారు. ఇక, అమెరికాలో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులుకూడా రేవంత్కు శుభాకాంక్షలు తెలిపారని రామకృష్ణ పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ సీఎంగా బాద్యతలు చేపట్టిన రేవంత్రెడ్డికి టీడీపీ అధినేత, రేవంత్ కు రాజకీయ గురువుగా పేర్కొనే మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో రేవంత్రెడ్డి ప్రజలకు సుపారిపాలన అందించాలని చంద్రబాబు ఆకాక్షించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం వెంటనే చంద్రబాబు.. ఎక్స్ వేదికగా స్పందించారు.
అదేవిధంగా నారా లోకేష్ కూడా రేవంత్కు శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి చంద్రబాబును రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అయితే.. అనివార్య కారణాలతో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో ఎక్స్ వేదికగా రేవంత్ను అభినందించారు. మరోవైపు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కూడా.. రేవంత్కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా పరస్పరం సహకరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
This post was last modified on December 7, 2023 7:46 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…