తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు గెలుచుకొని 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. దాదాపు 65 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనుకున్న సీఎం కేసీఆర్ ఆశలు అడియాశలుగానే మిగిలాయి. బీఆర్ఎస్ 31 స్థానాలలో విజయం సాధించి 8 స్థానాలలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు.
గవర్నర్ తమిళిసైని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు కేసీఆర్. మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్ నుంచి బయలుదేరి రాజ్ భవన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను కొనసాగమని గవర్నర్ తమిళిసై అడిగే అవకాశముంది. అయితే, అందుకు కేసీఆర్ అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
రేపు గవర్నర్ ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసే అవకాశముంది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కు వారు సమర్పించనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా బలం తమకుందని గవర్నర్ కు వారు తెలపనున్నారు. మరోవైపు, ఈ రోజు రాత్రి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ భేటీ కాబోతున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…