తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు గెలుచుకొని 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. దాదాపు 65 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనుకున్న సీఎం కేసీఆర్ ఆశలు అడియాశలుగానే మిగిలాయి. బీఆర్ఎస్ 31 స్థానాలలో విజయం సాధించి 8 స్థానాలలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు.
గవర్నర్ తమిళిసైని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు కేసీఆర్. మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్ నుంచి బయలుదేరి రాజ్ భవన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను కొనసాగమని గవర్నర్ తమిళిసై అడిగే అవకాశముంది. అయితే, అందుకు కేసీఆర్ అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
రేపు గవర్నర్ ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసే అవకాశముంది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కు వారు సమర్పించనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా బలం తమకుందని గవర్నర్ కు వారు తెలపనున్నారు. మరోవైపు, ఈ రోజు రాత్రి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ భేటీ కాబోతున్నారు.
This post was last modified on December 3, 2023 5:26 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…