టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గంలో 32,800 ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డి విజయ దుందుభి మోగించారు. 20 రౌండ్లలో ప్రతి రౌండ్ కు 2000 మెజారిటీ సాధించిన రేవంత్ తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి పై ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలో రేవంత్ కు 800 ఓట్లు దక్కాయి. దీంతో, ఓవరాల్ గా 33 వేల పైచిలుకు మెజారిటీతో రేవంత్ తన సొంత నియోజకవర్గంలో ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా, కామారెడ్డిలోనూ కేసీఆర్ పై దాదాపు 9 వేల ఓట్ల మెజారిటీతో రేవంత్ ముందంజలో ఉన్నారు.
పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కెసిఆర్ కాళ్లు మొక్కైనా నరేందర్ రెడ్డికి కీలక పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపి ఆయనకు భారీ మెజారిటీని కట్టబెట్టడం విశేషం.
అనూహ్యంగా కామారెడ్డిలో కేసీఆర్ మూడవ స్థానానికి పడిపోవడం బిఆర్ఎస్ శ్రేణులకు షాకిస్తోంది. కామారెడ్డిలో రేవంత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, బిజెపి అభ్యర్థి రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో, కామారెడ్డిలో కూడా రేవంత్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతల ర్యాలీ మధ్య గాంధీభవన్ కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేలాదిమంది కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ కు చేరుకున్నాయి. బాణాసంచా కాలుస్తూ డప్పు వాయిస్తూ కాంగ్రెస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంకుంటున్నాయి. గాంధీభవన వద్ద రేవంత్ అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. కొందరు టీడీపీ కార్యకర్తలు…జై బాబు అంటూ నినానాదాలు చేశారు. ఇక, గాంధీభవన్ కు రేవంత్ వెంట కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు.
సీఎం పదవి రేసులో రేవంత్ రెడ్డి ఉండడంతో కొడంగల్ ప్రజలు రేవంత్ కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. తమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉండాలని, అందుకు రేవంత్ ను గెలిపించుకోవాలని అందరూ ఫిక్సయ్యారని తెలుస్తోంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…