Political News

భారీ మెజారిటీతో రేవంత్ రెడ్డి ఘన విజయం

టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గంలో 32,800 ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డి విజయ దుందుభి మోగించారు. 20 రౌండ్లలో ప్రతి రౌండ్ కు 2000 మెజారిటీ సాధించిన రేవంత్ తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి పై ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలో రేవంత్ కు 800 ఓట్లు దక్కాయి. దీంతో, ఓవరాల్ గా 33 వేల పైచిలుకు మెజారిటీతో రేవంత్ తన సొంత నియోజకవర్గంలో ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా, కామారెడ్డిలోనూ కేసీఆర్ పై దాదాపు 9 వేల ఓట్ల మెజారిటీతో రేవంత్ ముందంజలో ఉన్నారు.

పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కెసిఆర్ కాళ్లు మొక్కైనా నరేందర్ రెడ్డికి కీలక పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపి ఆయనకు భారీ మెజారిటీని కట్టబెట్టడం విశేషం.
అనూహ్యంగా కామారెడ్డిలో కేసీఆర్ మూడవ స్థానానికి పడిపోవడం బిఆర్ఎస్ శ్రేణులకు షాకిస్తోంది. కామారెడ్డిలో రేవంత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, బిజెపి అభ్యర్థి రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో, కామారెడ్డిలో కూడా రేవంత్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతల ర్యాలీ మధ్య గాంధీభవన్ కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేలాదిమంది కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ కు చేరుకున్నాయి. బాణాసంచా కాలుస్తూ డప్పు వాయిస్తూ కాంగ్రెస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంకుంటున్నాయి. గాంధీభవన వద్ద రేవంత్ అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. కొందరు టీడీపీ కార్యకర్తలు…జై బాబు అంటూ నినానాదాలు చేశారు. ఇక, గాంధీభవన్ కు రేవంత్ వెంట కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు.

సీఎం పదవి రేసులో రేవంత్ రెడ్డి ఉండడంతో కొడంగల్ ప్రజలు రేవంత్ కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. తమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉండాలని, అందుకు రేవంత్ ను గెలిపించుకోవాలని అందరూ ఫిక్సయ్యారని తెలుస్తోంది.

This post was last modified on December 3, 2023 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

15 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

38 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

47 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago