ఏపీ రాష్ట్ర హోం మంత్రి ఒక మహిళ. దిశ చట్టాన్ని తీసుకొచ్చి అత్యాచారాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మహిళలపై నేరాలకు పాల్పడితే ఏకంగా జైలుపాలే అంటూ భారీ ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అత్యాచార కేసుల నమోదు ఎక్కువగా ఉండటం దేనికి నిదర్శనం? భర్త కళ్ల ముందే భార్యను.. బైకు మీద ప్రియుడితో వెళుతున్న ప్రియురాలిని.. ఇంట్లో ఉన్న మైనర్ బాలికపైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో అత్యాచార కేసుల సంఖ్య భారీగా ఉంటోంది.
మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడటం లేదన్న మాటను చెబుతున్నా.. గణాంకాలు మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగేలా చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆర్నెల్ల సంగతే చూస్తే.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. రాష్ట్రంలో ప్రతి రోజూ ముగ్గురికి పైగా అత్యాచారాలు జరుగుతున్నట్లుగా లెక్క తేలింది. అంటే.. నెలకు 98 మంది చొప్పున అత్యాచారాలకు గురి అవుతున్నట్లుగా గుర్తించారు.
ఇంత భారీగా కేసులు నమోదు కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇవి సరిపోవన్నట్లుగా పోలీసులపై దాడి చేస్తున్న వైనం ఏపీ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీస్తుంది. ఓవైపు కఠిన చట్టాలు ఉన్నట్లుగా చెబుతున్నప్పటికి.. ఏపీలో మాత్రం అత్యాచారాల కేసులు అంతకంతకూ పెరిగిపోవటం గమనార్హం. పాత రికార్డుల్ని చూసినా.. కేసులు పెరుగుతున్న వైనం కనిపిస్తుంది. 2018 మొదటి ఆరు నెలల్లో 546 అత్యాచార కేసులు నమోదైతే.. 2019లో 560 కేసులు నమోదయ్యాయి. తాజాగా (2020)లో 584 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.
ఇక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యధిక అత్యాచార ఘటనలు ఏపీ కార్యనిర్వాహఖ రాజధానిగా అభివర్ణిస్తున్న విశాఖలో ఆర్నెల్ల వ్యవధిలో 90 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా 85 కేసులతో నిలవగా మూడో స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా నిలిచింది. పెద్ద ఎత్తున నమోదవుతున్నకేసులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
This post was last modified on August 31, 2020 5:05 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…