Political News

ఏపీలో భారీగా పెరిగిన అత్యాచారాలు రేటు

ఏపీ రాష్ట్ర హోం మంత్రి ఒక మహిళ. దిశ చట్టాన్ని తీసుకొచ్చి అత్యాచారాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మహిళలపై నేరాలకు పాల్పడితే ఏకంగా జైలుపాలే అంటూ భారీ ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అత్యాచార కేసుల నమోదు ఎక్కువగా ఉండటం దేనికి నిదర్శనం? భర్త కళ్ల ముందే భార్యను.. బైకు మీద ప్రియుడితో వెళుతున్న ప్రియురాలిని.. ఇంట్లో ఉన్న మైనర్ బాలికపైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో అత్యాచార కేసుల సంఖ్య భారీగా ఉంటోంది.

మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడటం లేదన్న మాటను చెబుతున్నా.. గణాంకాలు మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగేలా చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆర్నెల్ల సంగతే చూస్తే.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. రాష్ట్రంలో ప్రతి రోజూ ముగ్గురికి పైగా అత్యాచారాలు జరుగుతున్నట్లుగా లెక్క తేలింది. అంటే.. నెలకు 98 మంది చొప్పున అత్యాచారాలకు గురి అవుతున్నట్లుగా గుర్తించారు.

ఇంత భారీగా కేసులు నమోదు కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇవి సరిపోవన్నట్లుగా పోలీసులపై దాడి చేస్తున్న వైనం ఏపీ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీస్తుంది. ఓవైపు కఠిన చట్టాలు ఉన్నట్లుగా చెబుతున్నప్పటికి.. ఏపీలో మాత్రం అత్యాచారాల కేసులు అంతకంతకూ పెరిగిపోవటం గమనార్హం. పాత రికార్డుల్ని చూసినా.. కేసులు పెరుగుతున్న వైనం కనిపిస్తుంది. 2018 మొదటి ఆరు నెలల్లో 546 అత్యాచార కేసులు నమోదైతే.. 2019లో 560 కేసులు నమోదయ్యాయి. తాజాగా (2020)లో 584 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.

ఇక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యధిక అత్యాచార ఘటనలు ఏపీ కార్యనిర్వాహఖ రాజధానిగా అభివర్ణిస్తున్న విశాఖలో ఆర్నెల్ల వ్యవధిలో 90 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా 85 కేసులతో నిలవగా మూడో స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా నిలిచింది. పెద్ద ఎత్తున నమోదవుతున్నకేసులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

This post was last modified on August 31, 2020 5:05 pm

Share
Show comments
Published by
satya
Tags: APRape Case

Recent Posts

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

39 mins ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

40 mins ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

48 mins ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

1 hour ago

ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…

1 hour ago

ఉండి పై రఘురామ ఉడుం పట్టు.!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన…

1 hour ago