Political News

ఏపీలో భారీగా పెరిగిన అత్యాచారాలు రేటు

ఏపీ రాష్ట్ర హోం మంత్రి ఒక మహిళ. దిశ చట్టాన్ని తీసుకొచ్చి అత్యాచారాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మహిళలపై నేరాలకు పాల్పడితే ఏకంగా జైలుపాలే అంటూ భారీ ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అత్యాచార కేసుల నమోదు ఎక్కువగా ఉండటం దేనికి నిదర్శనం? భర్త కళ్ల ముందే భార్యను.. బైకు మీద ప్రియుడితో వెళుతున్న ప్రియురాలిని.. ఇంట్లో ఉన్న మైనర్ బాలికపైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో అత్యాచార కేసుల సంఖ్య భారీగా ఉంటోంది.

మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడటం లేదన్న మాటను చెబుతున్నా.. గణాంకాలు మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగేలా చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఆర్నెల్ల సంగతే చూస్తే.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. రాష్ట్రంలో ప్రతి రోజూ ముగ్గురికి పైగా అత్యాచారాలు జరుగుతున్నట్లుగా లెక్క తేలింది. అంటే.. నెలకు 98 మంది చొప్పున అత్యాచారాలకు గురి అవుతున్నట్లుగా గుర్తించారు.

ఇంత భారీగా కేసులు నమోదు కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇవి సరిపోవన్నట్లుగా పోలీసులపై దాడి చేస్తున్న వైనం ఏపీ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీస్తుంది. ఓవైపు కఠిన చట్టాలు ఉన్నట్లుగా చెబుతున్నప్పటికి.. ఏపీలో మాత్రం అత్యాచారాల కేసులు అంతకంతకూ పెరిగిపోవటం గమనార్హం. పాత రికార్డుల్ని చూసినా.. కేసులు పెరుగుతున్న వైనం కనిపిస్తుంది. 2018 మొదటి ఆరు నెలల్లో 546 అత్యాచార కేసులు నమోదైతే.. 2019లో 560 కేసులు నమోదయ్యాయి. తాజాగా (2020)లో 584 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.

ఇక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యధిక అత్యాచార ఘటనలు ఏపీ కార్యనిర్వాహఖ రాజధానిగా అభివర్ణిస్తున్న విశాఖలో ఆర్నెల్ల వ్యవధిలో 90 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా 85 కేసులతో నిలవగా మూడో స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా నిలిచింది. పెద్ద ఎత్తున నమోదవుతున్నకేసులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

This post was last modified on August 31, 2020 5:05 pm

Share
Show comments
Published by
Satya
Tags: APRape Case

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago