Political News

నా దగ్గరకు రాకూడదు అని కెసిఆర్ కి ఎవరో చెప్పారు: మోడీ

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను హాజరైన బహిరంగ సభల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్యపై మాత్రం పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి మోడీ నోటి నుంచి వచ్చిన ఆ మాటలో నిజం ఎంతన్న ప్రశ్నతో పాటు.. మోడీ చేసిన సదరు వ్యాఖ్యపై సీఎం కేసీఆర్ తప్పనిసరిగా కౌంటర్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ మోడీ అన్న మాట ఏమంటే.. “మోడీ నీడ పడితే నీ సంపద మొత్తం పోతుందని కేసీఆర్ కు ఎవరో చెప్పారు. అందుకే నాకు ఎదురుపడటం లేదు. నేను ఎప్పుడు వచ్చినా 50 కీలోమీటర్ల దూరంలో ఉంటున్నారు” అంటూ చురకలు అంటించారు.

మోడీ మాటలకు తగ్గట్లే.. ఏదో ఒక కారణం చూపించి మోడీతో కలిసి వేదికను పంచుకోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా అనటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన మాటలో నిజం ఎంతన్న విషయంపై గులాబీ బాస్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ ను మూఢ నమ్మకాలను నమ్మే వ్యక్తిగా పంచ్ లు వేసే ప్రధాని మోడీ.. తాజా వ్యాఖ్యపై మాత్రం కేసీఆర్ స్పందించాలన్న మాట బలంగా వినిపిస్తోంది.ఒక రకంగా ఇది పబ్లిక్ డిమాండ్ అని.. మోడీ కోసం కాకున్నా.. సగటు తెలంగాణ వ్యక్తికి మోడీ చెప్పిన మాటల్లో నిజం ఎంతన్నది తెలుసుకోవాలన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on November 28, 2023 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మార్షల్స్ ను పెట్టి వైసీపీ సభ్యులను సభలోకి తేవాలి: లోకేశ్

సాధారణంగా శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా పార్టీకి చెందిన సభ్యులు హద్దుమీరి ప్రవర్తిస్తే మార్షల్స్ రంగ ప్రవేశం…

14 minutes ago

అనుష్క తప్పుకుంటే ప్రియదర్శి అందుకున్నాడు

గత డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన సారంగపాణి జాతకం ఎట్టకేలకు రిలీజ్ డేట్ దక్కించుకుంది. ఏప్రిల్ 18 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో…

50 minutes ago

తారక్ ఫ్యాన్స్.. డౌట్లేమీ అక్కర్లేదు

గత ఏడాది దసరాకు ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు జూనియర్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేసిన ఈ సినిమా కోసం…

1 hour ago

పోసాని విష‌యంలో జ‌రిగింది చాలు.. ఇక‌, వ‌దిలేయండి: శివాజీ

వైసీపీ నాయ‌కుడు, సినీ న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళిపై ఏపీ పోలీసులు ప‌లు కేసులు న‌మోదు చేసిన…

1 hour ago

2004, 2019ల్లో టీడీపీ ఓటమికి నేనే కారణం: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో…

1 hour ago

లోకేశ్ గెలిచారు!… మంగళగిరి మారిపోతోంది!

మంగళగిరి… నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కేంద్రంగానే రాజకీయం మొదలుపెట్టిన టీడీపీ…

2 hours ago