Political News

నా దగ్గరకు రాకూడదు అని కెసిఆర్ కి ఎవరో చెప్పారు: మోడీ

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను హాజరైన బహిరంగ సభల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్యపై మాత్రం పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి మోడీ నోటి నుంచి వచ్చిన ఆ మాటలో నిజం ఎంతన్న ప్రశ్నతో పాటు.. మోడీ చేసిన సదరు వ్యాఖ్యపై సీఎం కేసీఆర్ తప్పనిసరిగా కౌంటర్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ మోడీ అన్న మాట ఏమంటే.. “మోడీ నీడ పడితే నీ సంపద మొత్తం పోతుందని కేసీఆర్ కు ఎవరో చెప్పారు. అందుకే నాకు ఎదురుపడటం లేదు. నేను ఎప్పుడు వచ్చినా 50 కీలోమీటర్ల దూరంలో ఉంటున్నారు” అంటూ చురకలు అంటించారు.

మోడీ మాటలకు తగ్గట్లే.. ఏదో ఒక కారణం చూపించి మోడీతో కలిసి వేదికను పంచుకోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా అనటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన మాటలో నిజం ఎంతన్న విషయంపై గులాబీ బాస్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ ను మూఢ నమ్మకాలను నమ్మే వ్యక్తిగా పంచ్ లు వేసే ప్రధాని మోడీ.. తాజా వ్యాఖ్యపై మాత్రం కేసీఆర్ స్పందించాలన్న మాట బలంగా వినిపిస్తోంది.ఒక రకంగా ఇది పబ్లిక్ డిమాండ్ అని.. మోడీ కోసం కాకున్నా.. సగటు తెలంగాణ వ్యక్తికి మోడీ చెప్పిన మాటల్లో నిజం ఎంతన్నది తెలుసుకోవాలన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on November 28, 2023 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

29 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago