Political News

కొత్త లెక్క: కాకినాడ ఎంపీ సీటు మీద మెగా అన్న చూపు?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ – జనసేన పొత్తు నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మినీ మేనిఫెస్టో మీద చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు.. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాల మీదా చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు. టీడీపీ అధినేతతో పవన్ కల్యాణ్ కొన్ని సీట్లకు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన నరసాపూర్ ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగటం.. ఓట్ల వేటలో దారుణంగా వెనుకబడిపోవటం.. మూడో స్థానంలో నిలవటం తెలిసిందే. మొదటి స్థానంలో వైసీపీ నిలవగా.. రెండోస్థానంలో టీడీపీ నిలిచింది. మూడో స్థానంలో నాగబాబు నిలిచారు. ఈ చేదు అనుభవం నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా నరసాపురం నుంచి కాకినాడ ఎంపీ స్థానానికి మారాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. చంద్రబాబుతో దీని గురించి పవన్ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండటంతో పాటు.. జనసేనకు పట్టున్న కాకినాడ నుంచి నాగబాబును బరిలోకి దించితే గెలుపు ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది.

2018లో మాదిరి ఒంటరిగా కాకుండా టీడీపీ మద్దతుతో బరిలోకి దిగటం ద్వారా లాభం చేకూరుతుందన్న ఆలోచనలో జనసేన ఉన్నట్లుగా చెబుతున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేయటం ద్వారా లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో పాటు.. మరోసారి ఓటమికి దూరంగా ఉండాలంటే కాకినాడ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుందని తేల్చారు. గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సమయంలో నాగబాబు బరిలోకి దిగే కాకినాడ స్థానంలో పవన్ కల్యాణ్ ప్రచారాన్ని పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. జనసేన వర్గాల్లో వినిపిస్తున్న ఈ వాదనకు తగ్గట్లే టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన ఉంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

This post was last modified on November 15, 2023 12:28 pm

Share
Show comments

Recent Posts

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

19 minutes ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

28 minutes ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

43 minutes ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

58 minutes ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

1 hour ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

1 hour ago