టికెట్లు దక్కని వివిధ పార్టీల్లోని చాలామంది అసంతృప్తులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. టికెట్లు వచ్చే అవకాశంలేదని తెలిసి కూడా కారులో ఎక్కి కూర్చుంటున్నారు. చివరినిముషంలో వచ్చి చేరుతున్న కొత్త నేతలకు కేసీయార్, మంత్రులు కేటాయార్, హరీష్ రావులు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే పాత-కొత్త నేతల మధ్య ప్రతిరోజు వివాదాలు పెరిగిపోతున్నాయి. పార్టీలో కొత్తగా చేరారు అందులోను ఎన్నికల సమయంలో చేరారు కాబట్టి కొత్త నేతలకు ప్రాధాన్యత దక్కుతోంది.
దీన్ని పాత నేతలు తట్టుకోలేకపోతున్నారు. పైగా అభ్యర్ధులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్ నేతలతో కొత్త నేతల్లో కొందరు టచ్ లో ఉన్నారట. దాని వల్ల అభ్యర్ధులకు కొత్తనేతల వల్ల పెద్దగా ఉపయోగం కనబడటంలేదనే టాక్ పెరిగిపోతోంది. ఇదే విషయమై కేసీయార్, కేటీయార్, హరీష్ కూడా ఏరోజుకారోజు రిపోర్టు తెప్పించుకుంటున్నారు. ఎన్నికల్లో అభ్యర్ధులు ఓడిపోతే తర్వాత ఎన్నికల్లో తమకే ప్రాధాన్యత దక్కుతుందని, టికెట్ వచ్చే అవకాశముందని కొందరు కొత్త నేతలు ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది.
దీంతో కొత్తగా చేరిన నేతల వల్ల ఉపయోగం లేకపోయినా నష్టాలు తప్పవా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీంతో పార్టీపరంగా ఎంతమంది నేతల పనితీరుపై నిఘా పెట్టాలో అగ్రనేతలకు అర్ధంకావటంలేదు. బీజేపీ, కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే టార్గెట్ గా కేసీయార్, కేటీయార్, హరీష్ లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా పై పార్టీలను ఎలాగైనా దెబ్బకొట్టాల్సిందే అన్న కసితో పై పార్టీల్లోని అసంతృప్తులందరినీ చేర్చేసుకుంటున్నారు.
ఇపుడిదే పార్టీ అభ్యర్ధులకు పెద్ద సమస్యగా తయారైంది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు ఇన్చార్జిలకు, సీనియర్ నేతలకు పొసగటంలేదు. ఎవరి చెప్పినట్లు వినాలో అర్ధంకాక క్యాడర్ అయోమయంలో పడిపోయింది. ఈ సమయంలో ఇతర పార్టీల నుండి కొత్తనేతలు వచ్చి చేరటంతో గందరగోళం మరింతగా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న సమన్వయ లోపం చివరకు పార్టీ పుట్టిముంచేస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇన్చార్జి వ్యవస్ధ కూడా పార్టీకి మైనస్ అయ్యిందనే ప్రచారం పెరిగిపోతోంది. ఏదో చేయబోయి కేసీయార్ ఏదో చేశారా అనే అనుమానాలూ పెరిగిపోతున్నాయి. చివరకు ఎన్నికల్లో ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…