ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పువ్వాడ వేసిన నాలుగు సెట్ల నామినేషన్ లో తప్పులున్నాయని తుమ్మల ఆరోపించారు. పువ్వాడ నామినేషన్ రిజెక్ట్ చేయాల్సిందిగా ఎన్నికల అధికారిని కోరామని తుమ్మల నాగేశ్వరావు చెప్పారు. ఆర్ఓ నిబంధనలను పాటించడం లేదని, ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తుమ్మల చెప్పారు.
బీఆర్ఎస్ అరాచకాలు, అక్రమాలు ఎక్కువైపోయాయని, చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంతా ఒక పక్క ఖమ్మం జిల్లా ఓ పక్క అని, భీమవరంలో ఖమ్మం ఎన్నికలపై పందాలు కాస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని తుమ్మల అన్నారు. ఖమ్మం పౌరుషాల పురిటిగడ్డ అని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల పరువు ప్రతిష్టల కోసం పని చేశానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని అడగాలని కేటీఆర్ పై తుమ్మల షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని తుమ్మల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో అరాచక, అవినీతి, అక్రమ కేసులు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు. మత విద్వేషాలు లేకుండా దేశమంతా భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. తనతో పాటు పొంగులేటిని ఓడించాలని అధికార యంత్రాంగం మొత్తాన్ని అధికార పార్టీ నేతలు వాడుతున్నారని ఆరోపించారు.
This post was last modified on November 14, 2023 6:17 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…