బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై కొద్ది రోజులుగా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును పురంధేశ్వరి ఖండించిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు తదితరులు…పురంధేశ్వరిపై జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పురంధేశ్వరిపై మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పురందేశ్వరి రోజు మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నారేమో అని అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఏపీలో మద్యం అమ్మకాలపై పురందేశ్వరి కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిపై స్పందించిన అప్పలరాజు..ఇలా పురంధేశ్వరిపై నోరు జారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను మద్యం తాగనని, తనకు మద్యం టేస్ట్ లపై అవగాహన లేదని చెప్పిన అప్పలరాజు…మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని ఆరోపించారు.
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పురందేశ్వరికి కొంచెం గౌరవం ఉండేదని, కానీ, బీజేపీలో చేరిన తర్వాత చంద్రముఖిగా మారారని సెటైర్లు వేశారు. బీజేపీలోనూ పురందేశ్వరికి గౌరవం లేదని, ఆ పార్టీలో ఆమె ఉండడం అనవసరమని, టీడీపీలో చేరితే సరిపోతుందని సెటైర్లు వేశారు. మరి, అప్పల రాజు వ్యాఖ్యలపై పురందేశ్వరి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 10, 2023 10:09 pm
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. రెండు రోజుల కిందటే…
టాలీవుడ్ బాక్సాఫీస్లో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఈసారి వేసవిలో పెద్ద సినిమాలు లేకపోవడం పెద్ద మైనస్ కాగా..…