ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ కేసీయార్ స్లోగన్ మారుతోంది. భవిష్యత్తంతా ప్రాంతీయ పార్టీలదే అని కేసీయార్ పదే పదే చెబుతున్నారు. మొన్నటివరకు జాతీయపార్టీ బీఆర్ఎస్ ద్వారా దేశం మొత్తాన్ని ఏలేస్తానని గొప్పలు చెప్పుకున్న విషయం చూసిందే. మహారాష్ట్రాలో హడావుడి చేశారు. రెండు మూడుసార్లు కర్నాటకకు వెళ్ళారు. అవసరం లేకపోయినా ఉత్తరప్రదేశ్, పంజాబ్ అమరవీరులకు భారీ మొత్తంలో పరిహారాన్ని అందించారు. తరచూ ఢిల్లీకి వెళ్ళి క్యాంపేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదంతా దేనికి చేశారంటే జాతీయస్ధాయిలో ఎన్డీయే, యూపీఏకి బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని చెప్పటానికే.
సీన్ కట్ చేస్తే ఇపుడు తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ అనే పేరునే కేసీయార్ ప్రస్తావించటంలేదు. జై భారత్ అన్న నినాదమే వినిపించటంలేదు. ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ప్రాంతీయ పార్టీలదే హవా అంటున్నారు. ఒక్కసారిగా కేసీయార్లో ఎందుకింత మార్పొచ్చింది ? ఏమి ఆశించి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చారు ? ఈ ఎన్నికల ప్రచారంలో అసలు బీఆర్ఎస్ అన్న ప్రస్తావనే ఎందుకు తేవటంలేదు ?
ఎందుకంటే జనాల్లో జాతీయపార్టీ బీఆర్ఎస్ అన్నది సరిగా రిజిస్టర్ కాలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. జాతీయ పార్టీలు అంటే జనాల్లో ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అని మాత్రమే పీలింగ్ ఉందని అభ్యర్ధులు, నేతలే కేసీయార్ కు చెప్పారట. దాంతో జాతీయపార్టీ బీఆర్ఎస్ అని చెబితే నష్టం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో స్వయంగా కేసీయారే ప్రాంతీయపార్టీలదే భవిష్యత్తని యూటర్న్ తీసుకోవాల్సొచ్చిందట. ఇంతోటి దానికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారనే చర్చ పార్టీలోనే పెరిగిపోతోంది.
నిజానికి జాతీయ రాజకీయాల్లో కేసీయార్ ను పట్టించుకునే వాళ్ళేలేరు. జాతీయస్ధాయిలో కేసీయార్ విశ్వసనీయత బాగా దిబ్బతినేసింది. అందుకనే ఏ జాతీయపార్టీకానీ లేదా ప్రాంతీయపార్టీలు కానీ కేసీయార్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేరు. కేసీయార్ తో పొత్తుకు సిద్ధమని ప్రకటించిన కుమారస్వామి, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో భాగస్వాములైపోయారు. ఇదంతా చూసిన తర్వాతే కేసీయార్ మళ్ళీ ప్రాంతీయపార్టీ అనే స్లోగన్ మొదలుపెట్టినట్లున్నారు.
This post was last modified on November 10, 2023 1:27 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…