ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ కేసీయార్ స్లోగన్ మారుతోంది. భవిష్యత్తంతా ప్రాంతీయ పార్టీలదే అని కేసీయార్ పదే పదే చెబుతున్నారు. మొన్నటివరకు జాతీయపార్టీ బీఆర్ఎస్ ద్వారా దేశం మొత్తాన్ని ఏలేస్తానని గొప్పలు చెప్పుకున్న విషయం చూసిందే. మహారాష్ట్రాలో హడావుడి చేశారు. రెండు మూడుసార్లు కర్నాటకకు వెళ్ళారు. అవసరం లేకపోయినా ఉత్తరప్రదేశ్, పంజాబ్ అమరవీరులకు భారీ మొత్తంలో పరిహారాన్ని అందించారు. తరచూ ఢిల్లీకి వెళ్ళి క్యాంపేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదంతా దేనికి చేశారంటే జాతీయస్ధాయిలో ఎన్డీయే, యూపీఏకి బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని చెప్పటానికే.
సీన్ కట్ చేస్తే ఇపుడు తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ అనే పేరునే కేసీయార్ ప్రస్తావించటంలేదు. జై భారత్ అన్న నినాదమే వినిపించటంలేదు. ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ప్రాంతీయ పార్టీలదే హవా అంటున్నారు. ఒక్కసారిగా కేసీయార్లో ఎందుకింత మార్పొచ్చింది ? ఏమి ఆశించి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చారు ? ఈ ఎన్నికల ప్రచారంలో అసలు బీఆర్ఎస్ అన్న ప్రస్తావనే ఎందుకు తేవటంలేదు ?
ఎందుకంటే జనాల్లో జాతీయపార్టీ బీఆర్ఎస్ అన్నది సరిగా రిజిస్టర్ కాలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. జాతీయ పార్టీలు అంటే జనాల్లో ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అని మాత్రమే పీలింగ్ ఉందని అభ్యర్ధులు, నేతలే కేసీయార్ కు చెప్పారట. దాంతో జాతీయపార్టీ బీఆర్ఎస్ అని చెబితే నష్టం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో స్వయంగా కేసీయారే ప్రాంతీయపార్టీలదే భవిష్యత్తని యూటర్న్ తీసుకోవాల్సొచ్చిందట. ఇంతోటి దానికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారనే చర్చ పార్టీలోనే పెరిగిపోతోంది.
నిజానికి జాతీయ రాజకీయాల్లో కేసీయార్ ను పట్టించుకునే వాళ్ళేలేరు. జాతీయస్ధాయిలో కేసీయార్ విశ్వసనీయత బాగా దిబ్బతినేసింది. అందుకనే ఏ జాతీయపార్టీకానీ లేదా ప్రాంతీయపార్టీలు కానీ కేసీయార్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేరు. కేసీయార్ తో పొత్తుకు సిద్ధమని ప్రకటించిన కుమారస్వామి, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో భాగస్వాములైపోయారు. ఇదంతా చూసిన తర్వాతే కేసీయార్ మళ్ళీ ప్రాంతీయపార్టీ అనే స్లోగన్ మొదలుపెట్టినట్లున్నారు.
This post was last modified on November 10, 2023 1:27 pm
కొన్ని సినీ సిత్రాలు విచిత్రంగా ఉంటాయి. అవి సదరు హీరోలు దర్శకులు చెప్పినప్పుడే బయటికి వస్తాయి. అలాంటిదే ఇది. ఎల్లుండి…
పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ కు చెందిన 26 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడిన సంగతి…
సమంత నిర్మాతగా మారి తీసిన శుభం ఎల్లుండి విడుదల కాబోతోంది. దీని మీద బోలెడంత నమ్మకంతో ఉన్న సామ్ నిన్నటి…
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…
ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…
భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…