ప్రధాని నరేంద్ర మోడీ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశాని కి మోడీ అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఆయన చూపిన దిశానిర్దేశం భవిష్యత్తులో ఈ దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందని కూడా చెప్పారు. దేశానికి మోడీని దార్శనికుడిగా పవన్ అభివర్ణించా రు. అంతేకాదు.. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించగల సత్తా, ధైర్యం, సామర్థ్యం ఉన్నాయని ప్రశంసించారు.
“మోడీ మన దేశానికి కీలకమైన ఒక దార్శనిక నాయకుడు.. ఆయన ఎన్నో సవాళ్లను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న నేత.. బలమైన దృక్పథాన్ని వ్యక్తీకరించడం, ఐక్యతను పెంపొందించడం.. వివిధ రంగాలలో పరివర్తనాత్మక మార్పును నడిపించడం ద్వారా దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే సామర్థ్యం మోడీకి ఉంది” అని అన్నారు.
దేశంలో దీర్ఘకాలిక అభివృద్ధి, భవిష్యత్తు తరాల శ్రేయస్సుపై ఆలోచన చేస్తారని మోడీని పవన్ కొనియాడారు. మోడీ ‘విజన్ 2047’ని సాకారం చేయడానికి… జనసేన పార్టీ బీజేపీకి, మోడీకి మద్దతు ఇస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ జనసేనపార్టీకి 9 స్థానాలు కేటాయించింది. బీజేపీ-జనసేన తరఫున పవన్ ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ వేదికగా తన ప్రచారాన్ని ప్రారంభించేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 9, 2023 11:16 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…