Political News

ఎంఎల్సీలపై కేసీయార్ మండిపోతున్నారా ?

కొందరు ఎంఎల్సీలపై కేసీయార్ మండిపోతున్నారట. కారణం ఏమిటంటే పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్ధుల విజయానికి వీళ్ళు ఏమాత్రం సహకరించటంలేదట. సహకరించకపోగా వ్యతిరేకంగా పనిచేస్తు ఓటమికి కారణమవుతున్నారనే సమాచారం కేసీయార్ కు అందిందని పార్టీవర్గాల సమాచారం. విషయం ఏమిటంటే ఎంఎల్సీలుగా ఉంటూనే ఎంఎల్ఏ టికెట్ల కోసం కొందరు బాగా ప్రయత్నించారు. అయితే ఎంఎల్సీలుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎంఎల్ఏ టికెట్లు ఎందుకని కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో కొందరు ఎంఎల్సీలకు మండిందట.

అందుకనే తమను కాదని టికెట్లు తెచ్చుకున్న అభ్యర్దులపై తమ కసినంతా తీర్చుకుంటున్నారని పార్టీలోనే చర్చలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునే ఉద్దేశ్యంతోనే దాదాపు రెండున్నర నెలల ముందే కేసీయార్ అభ్యర్ధులను ప్రకటించారు. ఎంతముందుగా అభ్యర్ధులను ప్రకటించినా ఆశించినా స్ధాయిలో కొందరు ఎంఎల్సీలు, సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతల నుండి సహకారం లభించటంలేదనే ఫీడ్ బ్యాక్ కేసీయార్ కు అందిందట.

అందుకనే కొందరు ఎంఎల్సీలను కేసీయార్ పిలిపించుకుని గట్టిగా క్లాసులు కూడా పీకినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయినా వారిలో ఆశించిన మార్పురాలేదని తాజాగా కొందరు అభ్యర్ధులు కూడా ఫిర్యాదులు చేస్తున్నారట. తమ మద్దతుదారులకు, కులసంఘాల నేతల్లో తమకు బాగా సన్నిహితులైన వాళ్ళతో భేటీ అయిన కొందరు ఎంఎల్సీలు అభ్యర్ధులకు వ్యతిరేకంగా పనిచేయమని నోటిమాటగా చెబుతున్నారట. ఈ విషయం బయటకు పొక్కగానే అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తాండూరులో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అభ్యర్ధి పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపుకు ఏమాత్రం సహకరించటంలేదట. కొడంగల్ లో పోటీచేస్తున్న తన సోదరుడి గెలుపుకోసమే పనిచేస్తున్నారట.

తాండూరులో పట్నంకు మంచిపట్టుంది. రోహిత్ ను గెలిపిస్తారని అనుకుంటే చివరకు పట్నం పట్టించుకోవటంలేదని సమాచారం. భూపాలపల్లిలో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ స్పీకర్ మధుసూధనాచారి కూడా అభ్యర్ధి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపును పట్టించుకోవటంలేదట. గండ్ర గెలుపుకన్నా ఓటమికే ఎక్కువ పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వనందుకు ఎంఎల్సీ కోటిరెడ్డి అభ్యర్ధి నోముల భగత్ కు సహకరించటంలేదని ఆరోపణలున్నాయి. ఎంఎల్సీ యాక్టివిటీస్ పై కేసీయార్ ప్రత్యేకంగా రిపోర్టులు తెప్పించుకుంటున్నారని పార్టీవర్గాలు చెప్పాయి. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

This post was last modified on November 7, 2023 6:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

38 minutes ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

43 minutes ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

2 hours ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

3 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

3 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

3 hours ago