Political News

కోర్టులో జగన్ సర్కారుపై ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్త పోరు

ఏపీ అధికారపక్షానికి.. ఆంధ్రజ్యోతి మీడియాకు మధ్య నడుస్తున్న పోరు గురించి ఆ రాష్ట్రంలోని పిల్లాడ్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇంతకాలం తమ వార్తలతో జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సదరు మీడియా సంస్థ తరఫున ఒకరు.. తాజాగా న్యాయపోరాటానికి దిగటం ఆసక్తికరంగా మారింది. ఏపీ సర్కారు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు విజయవాడకుచెందిన కిలారు నాగశ్రవణ్.

ప్రభుత్వ ప్రకటనల్లో సింహభాగంగా సాక్షి దినపత్రిక.. ఇందిరా టెలివిజన్ కు చెందిన సాక్షి టీవీకి మాత్రమే ఇస్తున్న వైనాన్ని కోర్టు మందుకు తీసుకొచ్చింది. తన వాదనకు బలం చేకూరేలా కొన్ని ఆధారాల్ని కోర్టు ముందు ఉంచారు పిటిషనర్. ప్రభుత్వ నిర్ణయంతో అర్హత ఉండి కూడా కొన్ని మీడియా సంస్థలకు ప్రకటనలు రావటం లేదని.. సీఎం బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

మీడియాలో ఇచ్చే ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫోటోను నిర్ణీత పరిమాణం కంటే పెద్దగా ప్రచురిస్తున్నారని.. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండా రంగుల్ని ప్రభుత్వ ప్రకటనల్లో వినిగించటం రాజకీయంగా ప్రభావితం చేసినట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ పక్షపాత వైఖరి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పేర్కొన్నారు.

సర్క్యులేషన్ పరంగా చూస్తే.. ఆంధ్రజ్యోతి మూడో స్థానంలో ఉందని.. రెండో స్థానంలో సాక్షి ఉందని చెప్పారు. అలాంటి వేళ.. 2019 మే 23 నుంచి 2020 మే 30 వరకు వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలు.. వాటి ఖర్చు వివరాల్ని తాను పొందానని.. అందులో సాక్షి పత్రికకు భారీగా ప్రకటనలు ఇస్తున్నారని.. సర్య్కులేషన్ తో సంబంధం లేకుండా కొన్ని వార్తా పత్రికలకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఆంధ్రజ్యోతి తరపున.. ఆ సంస్థకు రావాల్సిన ఆదాయం గురించి హైకోర్టులో పిటిషన్ వేసి మరీ వాదిస్తున్న ఈ నాగ శ్రవణ్ ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరు జరుపుతున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

This post was last modified on August 28, 2020 11:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

42 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago