Political News

అమరావతి: సీఎంతో పాటు, కేబినెట్ కి, బీజేపీ టీడీపీలకు నోటీసులు

అమరావతి రైతులు రాజధాని పరిరక్షణ కోసం ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు వ్యూహాత్మకంగా చట్టం అండగా పోరాడుతున్నారు. రైతుల్లో ఎక్కువమంది చట్టాలు, హక్కులపై అవగాహన ఉన్నవారే కావడంతో ప్రభుత్వాన్ని సులువుగా ఇరుకున పెట్టగలుగుతున్నారు.

తాజాగా ఒక అనూహ్యమైన పిటిషను కొత్తకోణంలో హైకోర్టులో దాఖలైంది. ప్రభుత్వం రాజధాని తరలించడానికి దురుద్దేశపూరితమైన చట్టాలను చేసిందని, ఇందులో రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములు అయ్యాయని పేర్కొంటూ కొందరు అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. దీనికి కారణం… రైతులు వివిధ సందర్భాల్లో ఆయా రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్యానాలను జోడించడమే. వాటిని పరగణలోకి తీసుకున్న హైకోర్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రివర్గం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్షంలో, అధికారంలో ఉన్నపుడు ఆయా పార్టీలు చేసిన విరుద్దమైన వ్యాఖ్యాలను కోర్టు తీవ్రంగా తీసుకుంది.

రాజధాని అంశంపై దాఖలైన అనేక పిటిషన్లు గురువారం విచారణకు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. అంతవరకు స్టే విధించి.. మొత్తం పిటిషన్లను అధ్యయం చేసి 21 నుంచి రోజు వారి విచారణ చేయనున్నారు. ఇదిలా ఉండగా… అత్యధిక పిటిషన్లు దాఖలు కావడంతో అమరావతి కేసును హైకోర్టు ప్రత్యేకంగా పరిగణిస్తోంది. ఈ అంశంపై రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు నమోదు చేయడం గమనార్హం.

This post was last modified on August 27, 2020 4:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago