హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక కేజీ వెండి ధర ఏకంగా రూ.13,000 పెరిగి రూ.4,00,000 మార్కును అందుకుంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,170కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,400కి ఎగబాకి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. పెరిగితే వేలల్లో పెరుగుతూ, తగ్గితే కేవలం వందల్లోనే తగ్గుతున్న పసిడి తీరు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది.
ఈ అసాధారణ ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చింది. ఏడాది క్రితం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పుడే, “లక్ష దాటింది కదా.. ఇక ఇంతకంటే ఏం పెరుగుతుందిలే” అని చాలామంది తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ధరలు చూస్తుంటే వారు తల పట్టుకుంటున్నారు. ఊహించని విధంగా బంగారం ఇస్తున్న ఈ స్ట్రోక్ భరించడం సామాన్యుడి వల్ల కావడం లేదు.
ముఖ్యంగా తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోలేక అమ్మేసుకున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లోన్లకు వడ్డీలు కట్టలేక, గడువు ముగిసిపోతుండటంతో అప్పట్లో అమ్మేసిన వారు.. ఇప్పుడు అదే బంగారాన్ని మళ్ళీ కొనాలంటే డబుల్ రేటు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కష్టకాలంలో ఆదుకుంటుందని దాచుకున్న పసిడి, ఇప్పుడు మధ్యతరగతి కలలకి అందనంత దూరంగా వెళ్ళిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నప్పటికీ, పెరుగుదల మాత్రం భారీగానే ఉంది. సామాన్యుడి పెళ్ళిళ్ల సీజన్ వస్తుండటంతో ఈ రేట్లు చూసి పేద కుటుంబాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఒక్క రోజులోనే 24 క్యారెట్ల బంగారంపై రూ.3,220 పెరగడం అంటే సామాన్యమైన విషయం కాదు.
వెండి ధర కూడా కేజీకి నాలుగు లక్షలు కావడంతో సామాన్య భక్తులు సైతం వెండి వస్తువులను కొనేందుకు వెనకాడుతున్నారు. బంగారం అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, మధ్యతరగతి సెంటిమెంట్ కూడా. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ కంటే సంక్షోభమే ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మేసిన వారు ఇప్పుడు బాధపడుతుంటే, కొనే స్థోమత లేక మరికొందరు నిట్టూరుస్తున్నారు.
This post was last modified on January 28, 2026 2:20 pm
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…