Political News

అక్కకు సీటు… తమ్ముడికి చేయి !

తెలంగాణ ఎన్నికల్లో సీట్ల లొల్లి కాంగ్రెస్ లో కాక రేపుతూనే ఉంది. తాజాగా 45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని నాయకులు అసంత్రుప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుల జాబితాలో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. జూబ్లిహిల్స్ టికెట్ తనకే వస్తుందని ఇన్ని రోజులూ విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారానికి కూడా తెరలేపారు. కానీ ఇప్పుడు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ కు కాంగ్రెస్ అధిష్ఠానం ఈ టికెట్ కేటాయించింది.

జూబ్లిహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి రగలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన అజహరుద్దీన్ మొదటి నుంచి జూబ్లిహిల్స్ టికెట్ పైనే కన్నేశారు. మధ్యలో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు జూబ్లిహిల్స్ కు కూడా వచ్చారు. అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కార్యకర్తలు అజహరుద్దీన్ ను అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఇప్పుడేమో తనకు కాకుండా అజహరుద్దీన్ కు పార్టీ టికెట్ కేటాయించడంపై విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె సోదరి విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ దక్కింది. దీంతో పార్టీలోని ఇతర నాయకులకు ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చారు కానీ తమకు మాత్రమే నిబంధన అడ్డువచ్చిందా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో అర్ధం కావడం లేదని విష్ణువర్ధన్ అన్నారు. రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో షాక్ కు గురయ్యానని ఆయన చెప్పారు. పార్టీకి ఎవరు ముఖ్యమో గమనించాలన్నారు. హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలకు దండాలు పెట్టేవాళ్లకు కాకుండా ఢిల్లీలో దండాలు పెట్టిన వాళ్లకే టికెట్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న ఏకైక నియోజకవర్గం జూబ్లిహిల్స్ అని.. ఇప్పుడు నియోజకవర్గంతో సంబంధం లేని వాళ్లకు టికెట్ ఇచ్చారని ఆయన అన్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్న ఆయన కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్వతంత్రంగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది.

This post was last modified on October 28, 2023 11:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

28 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago