Political News

2జీ… 5జీ.. ఏది కావాలి? :  సెటైర్ల‌తో కుమ్మేసిన మోడీ

మాట‌ల మాంత్రికుడుగా.. విశ్వ‌గురువుగా ప్ర‌చారంలో ఉన్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌పై స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీని ఆయ‌న 2జీగా అభివ‌ర్ణించారు. అంతేకాదు.. ఇది కాలాతీత‌మైన ఫోన్‌.. అంటూ.. కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అదేస‌మ‌యంలో బీజేపీ అంటే 5జీగా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు 5జీనే కోరుకుంటున్నార‌ని.. 2జీ అనేది ఎప్పుడో 2014లోనే ప్ర‌జ‌లు మ‌రిచిపోయార‌ని మోడీ వ్యాఖ్యానించారు.

తాజాగా ఢిల్లీలో జ‌రిగిన `ఇండియా మొబైల్‌ కాంగ్రెస్` ఏడో ఎడిషన్‌ను మోడీ ప్రారంభించి.. ప్ర‌సంగించా రు. ప‌లువురు ముఖ్య పారిశ్రామిక వేత్త‌లు, దిగ్గ‌జ వ్యాపార వేత్త‌లు పాల్గొన్న ఈ స‌ద‌స్సులో మోడీ.. రాజ‌కీయ ప్ర‌సంగానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌పై ఆయ‌న విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఆ పార్టీని ‘కాలం చెల్లిన ఫోన్‌’తో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014లోనే ప్రజలు 2జీ ఫోన్లను వదిలేసి.. దేశ గతిని మార్చే 5జీ(బీజేపీ)ని ఎంచుకున్నార‌ని.. ఇప్పుడు వారి క‌ల సాకారం అవుతోంద‌ని మోడీ చెప్పుకొచ్చారు.

‘‘కాలం చెల్లిన ఫోన్లలో స్తంభించిన స్క్రీన్లపై.. ఎన్నిసార్లు స్వైప్‌ చేసినా, ఎన్ని బటన్లు నొక్కినా ఫలితం ఉండదు. రీస్టార్ట్‌ చేసినా, బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టినా.. చివరకు బ్యాటరీ మార్చినా ఆ ఫోన్లు పనిచేయవు. గత ప్రభుత్వం (కాంగ్రెస్) కూడా అలాంటి స్థితిలోనే  ఉంది. 2014లోనే ప్రజలు అలాంటి కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నారు. ఈ దేశానికి సేవ చేసేందుకు మాకు అవకాశం కల్పించారు. 2014 కేవలం తేదీ మాత్రమే కాదు. అదో పెను మార్పు’’ అని మోడీ వ్యాఖ్యానించారు.

త్వ‌ర‌లోనే 6జీ

ప్ర‌స్తుతం 5జీ సేవ‌ల‌ను ఈ ఏడాది చివ‌రి నాటికి దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్న ప్ర‌ధాని మోడీ.. త్వ‌ర‌లోనే 6జీ సేవ‌ల‌ను కూడా ప్ర‌జ‌లు ఆశ్వాదించే స‌మ‌యం వ‌చ్చేసింద‌న్నారు.  5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో భారత్‌ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా.. ఇప్పుడు 43వ ర్యాంక్‌కు చేరింద‌ని చెప్పారు.

This post was last modified on October 28, 2023 12:13 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రాష్ట్రానికి చ‌రిత్రాత్మ‌క రోజు:  చంద్ర‌బాబు

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్రానికి…

4 hours ago

ఏపీలో అశాంతి రేపిన ప్ర‌శాంత ఎన్నిక‌లు!

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు(అసెంబ్లీ+పార్ల‌మెంటు) ప్ర‌శాంతంగా జ‌రిగాయ‌ని ఎన్నిక‌లు సంఘం చెబుతోంది. అయితే.. ప్ర‌శాంతత కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. జిల్లాల‌కు మాత్ర‌మే…

4 hours ago

మళ్లీ వివరణ ఇచ్చుకున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…

4 hours ago

ఎమ్మెల్యే-చెంపదెబ్బ.. నేషనల్ ట్రెండింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…

4 hours ago

పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…

10 hours ago

జైలుకు వెళ్ల‌కుండా మీరే న‌న్ను కాపాడాలి:  కేజ్రీవాల్‌

కీల‌క‌మైన నాలుగోద‌శ ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవా ల్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.…

10 hours ago