ఏపీకి మరోసారి సీఎం జగన్ అవసరం ఉందని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే బాయ్ బాయ్ జగన్ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి కౌంటర్ గా టీడీపీ నేతలు తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు ‘‘ఏపీ హేట్స్ జగన్’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ‘వద్దు జగన్.. నిన్ను ఇక మేము భరించలేమని’ ముక్త కంఠంతో అంటున్నారని అచ్చెన్న ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, నాసిరకం మద్యంతో 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఉచిత ఇసుక రద్దుతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, విద్యుత్ ఛార్జీల భారం రూ.64 వేల కోట్లు అని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలోని హామీలు జగన్ నెరవేర్చ లేదని, సీపీఎస్ రద్దు , ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్ మాట తప్పారని ఎద్దేవా చేశారు.
3 రాజధానుల నాటకమాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అచ్చెన్న ధ్వజమెత్తారు. ప్రకృతి వనరుల్ని కబళించడానికే రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెడతారని జోస్యం చెప్పారు. 40 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని, కోర్టులు ఎందుకు వైసీపీ ప్రభుత్వాన్ని, విచారణ సంస్థలను ప్రశ్నించడం లేదని అచ్చెన్న ధ్వజమెత్తారు.
This post was last modified on October 20, 2023 4:52 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…