తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో వీటిని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సమా ఏడాదికి 4 గ్యాస్ సిలెండర్లు ఉచితం, రూ.500 లకే గ్యాస్, మహిళలకు నెల నెలా రూ.2000 సాయం వంటి కీలక హామీలు ఈ ఆరు గ్యారెంటీల్లో ఉన్నాయి. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ముహూర్తం పెట్టుకున్నారు.
ఇక, తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు.. తెలంగాణకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్న వారు.. బస్సు, బైకు యాత్రలు చేపట్టారు. ఇక, ఈ క్రమంలో హనుమకొండలో పర్యటించిన రాహుల్, ప్రియాంకలు.. ఇక్కడి రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన కార్డును రామప్ప పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ నేతలు రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్డులను స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క తదితరులు రాహుల్ వెంట ఉన్నారు. ప్రత్యేక పూజల అనంతరం రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్ విజయభేరి యాత్రను రాహుల్, ప్రియాంక గాంధీ ప్రారంభించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిహారిక కొణిదెల కెరీర్ చాలా డిఫరెంట్ గా సాగింది. యాంకర్ నుంచి నటిగా మొదట్లో ఆమె చేసిన…
మొన్న శుక్రవారం విడుదలైన కొత్త సినిమాల్లో 'ఓ సుకుమారి' ఉంది. ట్రైలర్ బట్టి కాన్సెప్ట్ ఏదో వెరైటీగా ఉంటుందనే అభిప్రాయం…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ తన ఫిట్నెస్తో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తుంటాడు. కానీ సడెన్గా ఆయన కాస్త…
వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన రాజధాని) ప్రాంతం ప్రస్తుతం ఉన్న సీఆర్ డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ)…
వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి సహా కుటుంబ సభ్యులపై శ్రీకాకుళం…
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ ను…