తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలూ అభ్యర్థులను ప్రకటించడం, వారికి బీఫారా లు ఇవ్వడం వంటివి యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. కానీ.. పార్టీ ఎంత ఖచ్చితంగా రూల్స్ పెట్టినా.. ఎన్నికమిటీలు వేసినా.. కాంగ్రెస్లో టికెట్ల ప్రకటన తర్వాత కూడా అసంతృప్తి రగులుతూనే ఉంది. కొందరు నాయకులు టికెట్ల వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వారిలో మాజీ మంత్రి, మైనారిటీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ఒకరు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో కామారెడ్డి నుంచి ఆయనకు టికెట్ కేటాయించారు. మొదట్లో ఈ విషయంపై షబ్బీర్ ఆందోళన పడకపోయినా.. ఇక్కడ అధికార పార్టీ బీఆర్ ఎస్ వ్యూహం డిఫరెంట్గా ఉండడంతో ఆయన ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఈ దఫా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ స్తున్న విషయం తెలిసిందే.
వీటిలో ఒకటి గజ్వేల్ నియోజకవర్గం కాగా, మరొకటి కామారెడ్డి. గజ్వేల్ పరిస్థితిలో కొంత తడబాటు కనిపిస్తుండడంతో సీఎం కేసీఆర్ మనసంతా కామారెడ్డిపై పెట్టారు. ఈ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ఆయన భావిస్తున్నారు. దీనికితోడు తొలిసారి సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండడంతో ఇక్కడ రాజకీయ పవనాలు, ప్రజల నాడి కూడా ఆయనకు అనుకూలంగా ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాలు రాజకీయంగా కూడా ఆసక్తిగా మారాయి.
దీంతో కాంగ్రెస్ తనకు కామారెడ్డి టికెట్ ఇచ్చినా.. సీఎం కేసీఆర్ అక్కడ నుంచి పోటీ చేస్తుండడంతో షబ్బీర్ అలీ వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కామారెడ్డి సీటు వద్దని.. ఎల్లారెడ్డి సీటు కేటాయించాలని ఆయన కోరుతున్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. అయితే.. ఇప్పటికే ఎల్లారెడ్డి టికెట్ ను కూడా కాంగ్రెస్ కన్ఫర్మ్ చేసింది. మదన్మోహన్రావుకి ఎల్లారెడ్డి టికెట్ ఇచ్చింది.
దీంతో మదన్మోహన్రావును అక్కడ నుంచి తప్పించి.. కామారెడ్డికి పంపించాలని.. తనకు ఎల్లారెడ్డి టికెట్ ఇవ్వాలని షబ్బీర్ అలీ.. తీవ్రస్థాయిలో మంతనాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్పై పోటీకి షబ్బీర్ అలీ భయపడుతున్నారా? లేక కేసీఆర్ గెలుపును ఆయన ముందుగానే అంచనా వేస్తున్నారా? అన్నది చూడాలి.
This post was last modified on October 17, 2023 11:16 am
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
ఏపీలో కీలక ప్రాంతమైన గుంటూరు నగర పాలక సంస్థలో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు మేయర్ గా…