“మనదే గెలుపు.. ఎవరూ తొందర పడొద్దు.. యాగీ చేయొద్దు” అంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ప్రగతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో 51 మందికి ఆయన స్వయంగా బీఫాంలు పంపిణీ చేశారు. మిగిలిన బీఫాంలు కూడా సిద్ధమవుతున్నాయని తెలిపారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.
అభ్యర్థులు కోపతాపాలు పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. సామరస్య పూర్వకంగాసీట్లను సర్దుబాటు చేసినట్టు వివరించారు. సాంకేతికంగా బీఆర్ ఎస్ను దెబ్బకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిచి తీరుతుందని ఆయన చెప్పారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలను మచ్చిక చేసుకుంటామన్నారు. చిన్న కార్తకర్త అయినా సరే.. అలిగినట్టు తెలిస్తే.. వారి ఇంటికెళ్లి మాట్లాడాలని నేతలకు సూచించారు.
అహంకారానికి పోయిన జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని అందుకే పక్కన పెట్టామని కేసీఆర్ చెప్పారు. అహంకారానికిపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. ఈ కారణంగానే కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందన్నారు. వేములవాడలో అభ్యర్థిని మార్చాల్సిన అవసరం లేదని, కానీ, న్యాయపరమైన అంశాల కారణంగా మార్పు తప్పలేదని కేసీఆర్ చెప్పారు.
ఎన్నికల సమయం కాబట్టి కొందరికి అసంతృప్తులు, కోపతాపాలు ఉంటాయయని, ఇవి సహజమేనని అన్నారు. అభ్యర్థులకు ఓపిక, సంయమనం ఉండాలని కేసీఆర్ సూచించారు. అనంతరం 51 నియోజకవర్గాలకు సంబంధించిన బీ ఫాంలను సీఎం కేసీఆర్ స్వయంగా అందించారు.
This post was last modified on October 15, 2023 5:51 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…