తెలంగాణలో వైఎస్సార్ టీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉంటుందని, కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయబోతున్నారని చాలాకాలంగా టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో విలీనం ప్రతిపాదనను షర్మిల వెనక్కు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. షర్మిల మిర్యాలగూడ, పాడేరు నుంచి పోటీ చేస్తారని, విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ విషయాన్ని వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ ఒంటరిగానే పోటీ చేయబోతోందని షర్మిల సంచలన ప్రకటన చేశారు. మొత్తం 119 స్థానాల్లో వైెఎస్సార్టీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనుకున్నామని, ఆ క్రమంలోనే కాంగ్రెస్ తో చర్చలు జరిపామని వెల్లడించారు. అందుకే, కాంగ్రెస్ నిర్ణయం కోసం 4 నెలలు వేచి చూశామని అన్నారు.
తాను పాలేరుతో పాటు మరో స్థానంలో కూడా పోటీ చేస్తానని, విజయమ్మ, అనిల్ కూడా పోటీ చేయాలనే డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. అయితే, విజయమ్మ పోటీ చేసే అవకాశాలున్నాయని, బీఫామ్ ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on October 12, 2023 9:51 pm
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…