Political News

పాడేరు నుంచి పోటీ చేస్తున్నా: షర్మిల

తెలంగాణలో వైఎస్సార్ టీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉంటుందని, కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయబోతున్నారని చాలాకాలంగా టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో విలీనం ప్రతిపాదనను షర్మిల వెనక్కు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. షర్మిల మిర్యాలగూడ, పాడేరు నుంచి పోటీ చేస్తారని, విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ విషయాన్ని వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ ఒంటరిగానే పోటీ చేయబోతోందని షర్మిల సంచలన ప్రకటన చేశారు. మొత్తం 119 స్థానాల్లో వైెఎస్సార్టీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనుకున్నామని, ఆ క్రమంలోనే కాంగ్రెస్ తో చర్చలు జరిపామని వెల్లడించారు. అందుకే, కాంగ్రెస్ నిర్ణయం కోసం 4 నెలలు వేచి చూశామని అన్నారు.

తాను పాలేరుతో పాటు మరో స్థానంలో కూడా పోటీ చేస్తానని, విజయమ్మ, అనిల్ కూడా పోటీ చేయాలనే డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. అయితే, విజయమ్మ పోటీ చేసే అవకాశాలున్నాయని, బీఫామ్ ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on October 12, 2023 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

8 minutes ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

40 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

3 hours ago