తెలంగాణలో వైఎస్సార్ టీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉంటుందని, కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయబోతున్నారని చాలాకాలంగా టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో విలీనం ప్రతిపాదనను షర్మిల వెనక్కు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. షర్మిల మిర్యాలగూడ, పాడేరు నుంచి పోటీ చేస్తారని, విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ విషయాన్ని వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ ఒంటరిగానే పోటీ చేయబోతోందని షర్మిల సంచలన ప్రకటన చేశారు. మొత్తం 119 స్థానాల్లో వైెఎస్సార్టీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనుకున్నామని, ఆ క్రమంలోనే కాంగ్రెస్ తో చర్చలు జరిపామని వెల్లడించారు. అందుకే, కాంగ్రెస్ నిర్ణయం కోసం 4 నెలలు వేచి చూశామని అన్నారు.
తాను పాలేరుతో పాటు మరో స్థానంలో కూడా పోటీ చేస్తానని, విజయమ్మ, అనిల్ కూడా పోటీ చేయాలనే డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. అయితే, విజయమ్మ పోటీ చేసే అవకాశాలున్నాయని, బీఫామ్ ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on October 12, 2023 9:51 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…