టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్న తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత నెల రోజులుగా రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. మరోవైపు, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తాజాగా నేడు పీటీ వారంట్ కు అనుమతించింది. పీటీ వారంట్ పై వాదనలను విన్న ఈ తీర్పును వెలువరించింది. దీంతో, సోమవారం నాడు చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది.
ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఒకవేళ శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు తరఫు లాయర్లకు జడ్జి సూచించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున వివేకానంద వాదించారు. దీంతో, చాలా రోజుల తర్వాత చంద్రబాబును రెండోసారి కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఇక, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును శుక్రవారం నాడు వెల్లడించనున్నారు.
మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. స్కిల్ కేసులో లోకేష్ ను నిందితుడిగా చూపలేదని, అరెస్టు చేయమని సీఐడీ చెప్పింది. అవసరమైతే 41 ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామని సీఐడీ తెలిపింది. దీంతో, ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.
This post was last modified on October 12, 2023 9:48 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…