Political News

సోమవారం కోర్టుకు చంద్రబాబు హాజరు

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్న తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత నెల రోజులుగా రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. మరోవైపు, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తాజాగా నేడు పీటీ వారంట్ కు అనుమతించింది. పీటీ వారంట్ పై వాదనలను విన్న ఈ తీర్పును వెలువరించింది. దీంతో, సోమవారం నాడు చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది.

ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఒకవేళ శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు తరఫు లాయర్లకు జడ్జి సూచించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున వివేకానంద వాదించారు. దీంతో, చాలా రోజుల తర్వాత చంద్రబాబును రెండోసారి కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఇక, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును శుక్రవారం నాడు వెల్లడించనున్నారు.

మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. స్కిల్ కేసులో లోకేష్ ను నిందితుడిగా చూపలేదని, అరెస్టు చేయమని సీఐడీ చెప్పింది. అవసరమైతే 41 ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామని సీఐడీ తెలిపింది. దీంతో, ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.

This post was last modified on October 12, 2023 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజమౌళి శాపం.. తొలగినట్లేనా?

రాజమౌళితో సినిమా చేయడం ఏ నటుడికైనా ఒక వరమే. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఇప్పటిదాకా ఆయన అపజయమే ఎరుగలేదు.…

13 hours ago

‘జ‌గ‌న్’ కోసం బీజేపీ వెయిటింగ్‌.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌!!

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ కోసం.. బీజేపీ నేత‌లు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇదేదో పార్టీల‌కు సంబంధించిన…

18 hours ago

కాలిపోయిన సుదర్శన్ కటవుట్ కథేంటి

తెలుగు రాష్ట్రాల్లోనే ఐకానిక్ థియేటర్ గా పేరున్న సుదర్శన్ 35 ఎంఎంలో దేవర కటవుట్ హఠాత్తుగా మంటల్లో కాలిపోవడం అభిమానులను…

19 hours ago

జాన్వీ కపూర్ మొదటి పరీక్ష పాసయ్యిందా

టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు గాంచిన స్వర్గీయ శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ మీద మన ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది.…

20 hours ago

పాట తీసేయడం మంచి నిర్ణయం

ఈ రోజు విడుదలైన దేవర పార్ట్ 1లో దావూది పాటని ఫైనల్ ఎడిటింగ్ లో తీసేసిన విషయాన్ని మా సైట్…

21 hours ago

జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న స్టార్ట్‌.. అంతా ఉత్కంఠే..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. రేపు(శ‌నివారం) ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదంతా తిరుమల శ్రీవారి…

23 hours ago