Political News

డే-2.. 47 ప్ర‌శ్న‌లు.. నా టైం వేస్ట్‌: నారా లోకేష్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ.. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్‌పై కేసు న‌మోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయ‌న‌ను విచారిస్తున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఒక్క రోజు విచార ణ‌కు హైకోర్టు అనుమ‌తించినా.. అధికారులు మాత్రం వ‌రుస‌గా రెండో రోజు కూడా నారా లోకేష్‌ను విచారించారు. అయితే, రెండో రోజైన బుధ‌వారం కూడా ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల‌కు సుమారు 6 గంట‌ల‌కు పైగా త‌న‌ను విచారించినా.. ఎలాంటి లాభం లేద‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

“రెండో రోజు విచార‌ణ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, వ్య‌వ‌స్థ‌ల‌పై ఉన్న గౌర‌వంతో వెళ్లాను. హైకోర్టు కేవ‌లం ఒక్క‌రోజుకే అనుమ‌తి ఇచ్చింది. అయినా.. అధికారులు రెండో రోజు కూడా ర‌మ్మ‌ని నోటీసులు ఇచ్చారు. రెండో రోజు ఏకంగా 47 ప్ర‌శ్న‌లు అడిగారు. కానీ, దీనిలో కూడా ఇన్న‌ర్ రింగ్ రోడ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు లేవు. హెరిటేజ్ పెట్టుబ‌డులు, మా అమ్మ భువ‌నేశ్వ‌రి ఐటీ రిట‌ర్న్స్ వంటి అంశాల‌నే ప్ర‌స్తావించారు. వాటిపై నాకు అవ‌గాహ‌న ఎలా ఉంటుంది? అందుకే ఆ విష‌యాల‌ను ఆడిట‌ర్‌నే అడ‌గ‌మ‌ని చెప్పాను. మొత్తానికి నా టైం వేస్ట్ చేశారు” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ఇక‌, రెండో రోజు సీఐడీ అధికారులు నారా లోకేష్‌ను విచారించిన‌ప్ప‌టికీ.. ఇత‌మిత్థంగా ఇన్న‌ర్ రింగ్ రోడ్ అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన ఆధారాల‌ను ఆయ‌న ముందు పెట్ట‌లేద‌ని తెలిసింది. కేవ‌లం విచార‌ణ పేరుతో ఆరు గంట‌ల పాటు త‌మ ముందు కూర్చోబెట్టుకున్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించారు.

విచార‌ణ అనంత‌రం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. “ఇన్నర్‌ రోడ్ కేసు ఆధారాలు ఎక్కడా చూపెట్టడం లేదు. అజేయ కల్లాంరెడ్డి, ప్రేమ్‌చంద్రారెడ్డిపై ఎఫ్ ఐఆర్‌ ఎందుకు న‌మోదు చేయ‌లేదు?. అజేయ కల్లాం, ప్రేమ్‌చంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదు?. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ ఆడిటర్‌ను అడగమని చెప్పా. మేం ఉంటున్న లింగ‌మ‌నేని ఎస్టేట్‌కు రెంట్ చెల్లిస్తే క్విడ్‌ ప్రోకో ఎలా అవుతుంది?” అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు.

This post was last modified on October 11, 2023 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

26 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

50 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago