Political News

డే-2.. 47 ప్ర‌శ్న‌లు.. నా టైం వేస్ట్‌: నారా లోకేష్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ.. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్‌పై కేసు న‌మోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయ‌న‌ను విచారిస్తున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఒక్క రోజు విచార ణ‌కు హైకోర్టు అనుమ‌తించినా.. అధికారులు మాత్రం వ‌రుస‌గా రెండో రోజు కూడా నారా లోకేష్‌ను విచారించారు. అయితే, రెండో రోజైన బుధ‌వారం కూడా ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల‌కు సుమారు 6 గంట‌ల‌కు పైగా త‌న‌ను విచారించినా.. ఎలాంటి లాభం లేద‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

“రెండో రోజు విచార‌ణ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, వ్య‌వ‌స్థ‌ల‌పై ఉన్న గౌర‌వంతో వెళ్లాను. హైకోర్టు కేవ‌లం ఒక్క‌రోజుకే అనుమ‌తి ఇచ్చింది. అయినా.. అధికారులు రెండో రోజు కూడా ర‌మ్మ‌ని నోటీసులు ఇచ్చారు. రెండో రోజు ఏకంగా 47 ప్ర‌శ్న‌లు అడిగారు. కానీ, దీనిలో కూడా ఇన్న‌ర్ రింగ్ రోడ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు లేవు. హెరిటేజ్ పెట్టుబ‌డులు, మా అమ్మ భువ‌నేశ్వ‌రి ఐటీ రిట‌ర్న్స్ వంటి అంశాల‌నే ప్ర‌స్తావించారు. వాటిపై నాకు అవ‌గాహ‌న ఎలా ఉంటుంది? అందుకే ఆ విష‌యాల‌ను ఆడిట‌ర్‌నే అడ‌గ‌మ‌ని చెప్పాను. మొత్తానికి నా టైం వేస్ట్ చేశారు” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ఇక‌, రెండో రోజు సీఐడీ అధికారులు నారా లోకేష్‌ను విచారించిన‌ప్ప‌టికీ.. ఇత‌మిత్థంగా ఇన్న‌ర్ రింగ్ రోడ్ అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన ఆధారాల‌ను ఆయ‌న ముందు పెట్ట‌లేద‌ని తెలిసింది. కేవ‌లం విచార‌ణ పేరుతో ఆరు గంట‌ల పాటు త‌మ ముందు కూర్చోబెట్టుకున్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించారు.

విచార‌ణ అనంత‌రం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. “ఇన్నర్‌ రోడ్ కేసు ఆధారాలు ఎక్కడా చూపెట్టడం లేదు. అజేయ కల్లాంరెడ్డి, ప్రేమ్‌చంద్రారెడ్డిపై ఎఫ్ ఐఆర్‌ ఎందుకు న‌మోదు చేయ‌లేదు?. అజేయ కల్లాం, ప్రేమ్‌చంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదు?. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ ఆడిటర్‌ను అడగమని చెప్పా. మేం ఉంటున్న లింగ‌మ‌నేని ఎస్టేట్‌కు రెంట్ చెల్లిస్తే క్విడ్‌ ప్రోకో ఎలా అవుతుంది?” అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు.

This post was last modified on October 11, 2023 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

23 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago