ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్లో అవకతవకలు జరిగాయంటూ.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్పై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయనను విచారిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఒక్క రోజు విచార ణకు హైకోర్టు అనుమతించినా.. అధికారులు మాత్రం వరుసగా రెండో రోజు కూడా నారా లోకేష్ను విచారించారు. అయితే, రెండో రోజైన బుధవారం కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు సుమారు 6 గంటలకు పైగా తనను విచారించినా.. ఎలాంటి లాభం లేదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
“రెండో రోజు విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ, వ్యవస్థలపై ఉన్న గౌరవంతో వెళ్లాను. హైకోర్టు కేవలం ఒక్కరోజుకే అనుమతి ఇచ్చింది. అయినా.. అధికారులు రెండో రోజు కూడా రమ్మని నోటీసులు ఇచ్చారు. రెండో రోజు ఏకంగా 47 ప్రశ్నలు అడిగారు. కానీ, దీనిలో కూడా ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించిన ప్రశ్నలు లేవు. హెరిటేజ్ పెట్టుబడులు, మా అమ్మ భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ వంటి అంశాలనే ప్రస్తావించారు. వాటిపై నాకు అవగాహన ఎలా ఉంటుంది? అందుకే ఆ విషయాలను ఆడిటర్నే అడగమని చెప్పాను. మొత్తానికి నా టైం వేస్ట్ చేశారు” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇక, రెండో రోజు సీఐడీ అధికారులు నారా లోకేష్ను విచారించినప్పటికీ.. ఇతమిత్థంగా ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకలకు సంబంధించిన ఆధారాలను ఆయన ముందు పెట్టలేదని తెలిసింది. కేవలం విచారణ పేరుతో ఆరు గంటల పాటు తమ ముందు కూర్చోబెట్టుకున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు.
విచారణ అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. “ఇన్నర్ రోడ్ కేసు ఆధారాలు ఎక్కడా చూపెట్టడం లేదు. అజేయ కల్లాంరెడ్డి, ప్రేమ్చంద్రారెడ్డిపై ఎఫ్ ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?. అజేయ కల్లాం, ప్రేమ్చంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదు?. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ఆడిటర్ను అడగమని చెప్పా. మేం ఉంటున్న లింగమనేని ఎస్టేట్కు రెంట్ చెల్లిస్తే క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?” అని నారా లోకేష్ ప్రశ్నించారు.
This post was last modified on October 11, 2023 9:48 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…