Political News

లోకేష్ విచారణ..హఠాత్తుగా అధికారి మార్పు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సిఐడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాడేపల్లి సిట్ కార్యాలయంలో లొకేషన్ సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఓవైపు విచారణ జరుగుతుండగానే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లోకేష్ ను విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారిని హఠాత్తుగా మారుస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది.

ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఎస్పీ జయరామరాజు స్థానంలో డిఎస్పీ విజయభాస్కర్ కు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇలా, విచారణ అధికారి మార్పునకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జయరామరాజుకు పని భారం ఎక్కువగా ఉందని, ఆ కారణంతోనే దర్యాప్తు అధికారిని మారుస్తున్నామని ఆ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. విచారణ సందర్భంగా లోకేష్ ను సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. లింగమనేని రమేష్ కు, మీకు ఉన్న సంబంధం ఏమిటి అని లోకేష్ ను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

హెరిటేజ్ సంస్థ భూ కొనుగోళ్లపై కూడా సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ ఆధ్వర్యంలోనే భూముల కొనుగోలు జరిగిందని, ఎకరం ఎనిమిది లక్షలకు కొనుగోలు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, హెరిటేజ్ కు సంబంధించిన ఒక సమావేశానికి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో లోకేష్ హాజరైనట్లు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారని తెలుస్తోంది.

This post was last modified on October 10, 2023 10:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

54 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago