అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సిఐడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాడేపల్లి సిట్ కార్యాలయంలో లొకేషన్ సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఓవైపు విచారణ జరుగుతుండగానే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లోకేష్ ను విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారిని హఠాత్తుగా మారుస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది.
ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఎస్పీ జయరామరాజు స్థానంలో డిఎస్పీ విజయభాస్కర్ కు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇలా, విచారణ అధికారి మార్పునకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జయరామరాజుకు పని భారం ఎక్కువగా ఉందని, ఆ కారణంతోనే దర్యాప్తు అధికారిని మారుస్తున్నామని ఆ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. విచారణ సందర్భంగా లోకేష్ ను సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. లింగమనేని రమేష్ కు, మీకు ఉన్న సంబంధం ఏమిటి అని లోకేష్ ను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
హెరిటేజ్ సంస్థ భూ కొనుగోళ్లపై కూడా సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ ఆధ్వర్యంలోనే భూముల కొనుగోలు జరిగిందని, ఎకరం ఎనిమిది లక్షలకు కొనుగోలు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, హెరిటేజ్ కు సంబంధించిన ఒక సమావేశానికి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో లోకేష్ హాజరైనట్లు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారని తెలుస్తోంది.
This post was last modified on October 10, 2023 10:00 pm
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…