Political News

లోకేష్ విచారణ..హఠాత్తుగా అధికారి మార్పు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు సిఐడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తాడేపల్లి సిట్ కార్యాలయంలో లొకేషన్ సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఓవైపు విచారణ జరుగుతుండగానే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లోకేష్ ను విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారిని హఠాత్తుగా మారుస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది.

ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఎస్పీ జయరామరాజు స్థానంలో డిఎస్పీ విజయభాస్కర్ కు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇలా, విచారణ అధికారి మార్పునకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జయరామరాజుకు పని భారం ఎక్కువగా ఉందని, ఆ కారణంతోనే దర్యాప్తు అధికారిని మారుస్తున్నామని ఆ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. విచారణ సందర్భంగా లోకేష్ ను సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. లింగమనేని రమేష్ కు, మీకు ఉన్న సంబంధం ఏమిటి అని లోకేష్ ను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

హెరిటేజ్ సంస్థ భూ కొనుగోళ్లపై కూడా సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ ఆధ్వర్యంలోనే భూముల కొనుగోలు జరిగిందని, ఎకరం ఎనిమిది లక్షలకు కొనుగోలు చేశారని అధికారులు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, హెరిటేజ్ కు సంబంధించిన ఒక సమావేశానికి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో లోకేష్ హాజరైనట్లు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారని తెలుస్తోంది.

This post was last modified on October 10, 2023 10:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

3 minutes ago

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

39 minutes ago

ఎండలు…క్రికెట్ మ్యాచులు…థియేటర్లలో ఖాళీ కుర్చీలు

బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…

55 minutes ago

అమ‌రావ‌తికి డ‌బ్బే డ‌బ్బు.. మాట‌లు కాదు చేత‌లే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. డ‌బ్బులు ఇచ్చే వారి కోసం స‌ర్కారు ఎదురు చూసింది. గ‌త వైసీపీ…

1 hour ago

అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

1 hour ago

దేవా కట్టాపై రాజమౌళి ప్రేమ,

దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…

2 hours ago