Political News

ఫిబ్రవరిలో మేనిఫెస్టో..మార్చిలో ఎన్నికలు: జగన్

తెలంగాణతోపాటు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారని పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో అమిత్ షాతో ముందస్తు ఎన్నికలపైనే జగన్ మాట్లాడారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లపై సీఎం జగన్ క్లారిటీనిచ్చారు. 2024 మార్చిలో ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగుతాయని జగన్ తేల్చి చెప్పేశారు. ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని, మార్చి నెలలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవ్వాలని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.

విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. అక్టోబరు 25 నుంచి డిసెంబర్ 21 వరకు బస్సు యాత్ర చేపట్టబోతున్నానని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో బస్సు యాత్రలు కొనసాగుతాయని, ప్రతిరోజు మూడు సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నేతలుంటారని అన్నారు. ఇది కేవలం బస్సు యాత్ర కాదని సామాజిక న్యాయ యాత్ర అని జగన్ చెప్పారు. తన ప్రభుత్వంలో ప్రజలకు, పేదవారికి జరిగిన మంచిని వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నామని అన్నారు.

మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానులను రూపొందిస్తామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోని 99% హామీలను అమలు చేశామని, గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ అన్నారు. ఏపీకి జగన్ ఎందుకు రావాలో చెప్పేందుకే ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కోటి 60 లక్షల మంది ఇళ్లకు వెళ్లే విధంగా కార్యక్రమం రూపొందించామన్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం చేపడతామని చెప్పారు.

This post was last modified on October 9, 2023 4:29 pm

Share

Recent Posts

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

20 minutes ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

1 hour ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

1 hour ago

హనుమాన్ విజయమే మహాకాళీ ధైర్యం

2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…

1 hour ago

బట్వారా పబ్లిక్ టాక్ తేడాగా ఉందే…

తాజాగా విడుదలైన బట్వారా 1947 ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకోలేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశ పరుస్తోంది. అనూహ్యంగా ఆవారాపన్ 2…

1 hour ago

‘సనాతన’ వివాదంపై అనసూయ క్లారిటీ

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…

3 hours ago