తెలంగాణతోపాటు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారని పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో అమిత్ షాతో ముందస్తు ఎన్నికలపైనే జగన్ మాట్లాడారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లపై సీఎం జగన్ క్లారిటీనిచ్చారు. 2024 మార్చిలో ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగుతాయని జగన్ తేల్చి చెప్పేశారు. ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని, మార్చి నెలలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవ్వాలని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.
విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. అక్టోబరు 25 నుంచి డిసెంబర్ 21 వరకు బస్సు యాత్ర చేపట్టబోతున్నానని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో బస్సు యాత్రలు కొనసాగుతాయని, ప్రతిరోజు మూడు సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నేతలుంటారని అన్నారు. ఇది కేవలం బస్సు యాత్ర కాదని సామాజిక న్యాయ యాత్ర అని జగన్ చెప్పారు. తన ప్రభుత్వంలో ప్రజలకు, పేదవారికి జరిగిన మంచిని వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నామని అన్నారు.
మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానులను రూపొందిస్తామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోని 99% హామీలను అమలు చేశామని, గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ అన్నారు. ఏపీకి జగన్ ఎందుకు రావాలో చెప్పేందుకే ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కోటి 60 లక్షల మంది ఇళ్లకు వెళ్లే విధంగా కార్యక్రమం రూపొందించామన్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం చేపడతామని చెప్పారు.
This post was last modified on October 9, 2023 4:29 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…