Political News

నవంబరు 30న తెలంగాణ ఎన్నికలు

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాలలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. 2024 ఫైనల్ ఎలక్షన్ కు ఈ ఐదు రాష్ట్రాల ఎలక్షన్లు సెమీ ఫైనల్ గా కేంద్రంలోని బీజేపీ భావిస్తోంది. ఇక, జమిలి ఎన్నికల ప్రక్రియ రాబోయే ఏడాదికి సాధ్యం కాకపోవడంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల విడుదల చేసింది.

తెలంగాణతో పాటు రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల షెడ్యూల్ ను సిఇసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణలో నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబరు 3వ తారీఖున నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబరు 10వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. నామినేషన్ల పరిశీలనకు 13 నవంబర్ వరకు గడువు ఉంది. 15 నవంబర్ లోపు అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. డిసెంబర్ 5వ తేదీ లోపు కౌంటింగ్ పూర్తి చేయాలని నోటిఫికేషన్లో వెల్లడించారు.

మిజోరంలో నవంబర్ 7న ఒక దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఛత్తీస్ గఢ్ లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ తేదీ నవంబర్ 7న, 17న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. రాజస్థాన్ లో నవంబర్ 23న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌…మధ్యప్రదేశ్‌లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్, మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉన్నాయి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago