Movie News

‘సనాతన’ వివాదంపై అనసూయ క్లారిటీ

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక, సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసేవారికి అనసూయ ఇచ్చే కౌంటర్లు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. అయితే, అనసూయ హిందూ ధర్మం, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారం రేగుతోంది. హిందూ ధర్మాన్ని అనసూయ అవమానించారంటూ కొందరు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై అనసూయ తనదైన శైలిలో స్పందించారు.

తన మాటలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అనసూయ అన్నారు. తాను ఏ మతాన్ని కించపరచలేదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని చెప్పారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే పక్కా హిందువునని, తన ధర్మం, విశ్వాసాల పట్ల తనకు ఎలాంటి అనుమానం లేదని స్పష్వ చేధీరు. పదిహేనేళ్లుగా సోషల్ మీడియాలో ఉన్నానని, ఈ ట్రోల్స్, వక్రీకరణలు తనకు కొత్త కాదని అన్నారు. తాను చెప్పిన అసలు విషయాన్ని పక్కన పెట్టి, వారికి కావాల్సిన కామెంట్స్ వరకు కట్ చేసి వైరల్ చేస్తున్నారని చెప్పారు.

తాను ఏ సందర్భంలో ఏం వ్యాఖ్యలు చేశానో పూర్తిగా చూడాలని, ఆ తర్వాత తనను విమర్శించాలని కోరారు. అలా కాకుండా తాను సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. తాను హనుమంతుడి భక్తురాలినని, శ్రీరాముడినే కొలుస్తానని, తన పెద్ద కుమారుడికి హనుమంతుడి పేరు పెట్టుకున్నానని చెప్పారు.

‘జై శ్రీరామ్’ అనే నినాదం ముసుగులో కొందరు దాడులకు తెగబడుతున్నారని గతంలో అనసూయ ఓ సందర్భంలో అన్నారు. కేవలం నినాదాలు చేయడం కంటే వ్యక్తుల ప్రవర్తనే ముఖ్యమని చెప్పారు. సనాతన ధర్మం పేరుతో దాడులు చేయడం సరికాదని ఆమె గతంలో హితవు పలికారు.

This post was last modified on August 14, 2026 8:51 pm

Share

Recent Posts

ప‌వ‌న్ స‌తీమ‌ణి సింప్లిసిటీ… రైలులో పిఠాపురం వరకు..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సతీమ‌ని అన్నా కొణిదెల ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నారు. త‌న…

1 hour ago

రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…

1 hour ago

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

3 hours ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

3 hours ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

4 hours ago

వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…

4 hours ago