రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు.. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడేందుకు సై అంటున్నారు.. ఇదీ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం. కానీ బండ్ల గణేష్ మాత్రం ఈ పారి ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనా ఈ సారి తనకు టికెట్ వద్దని బండ్ల గణేష్ చెప్పేశారు.
2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో బండ్ల గణేష్ చేరారు. అప్పుడు తన సొంత నియోజకవర్గమైన షాద్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపిఐ కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. మహా కూటమికి మెజారిటీ వస్తుందని, కాంగ్రెస్ కు 80కి పైగా సీట్లు వస్తాయని అప్పుడు బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గెలవకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో పీక కోసుకుంటున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఓడిపోవడంతో గణేష్ మాట మార్చారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్ యాక్టివ్ అయ్యారు. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన గణేష్ ను కూకట్ పల్లిలో పోటీచేయిస్తే సానుకూల ఫలితాలు రాబట్టవచ్చని కాంగ్రెస్ భావించినట్లు తెలిసింది. దీంతో టికెట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కానీ గణేష్ మాత్రం పోటీ చేయనని ట్విటర్ ద్వారా ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు తనకు అవకాశం ఇస్తానని చెప్పారు కానీ ఈ సారి టికెట్ వద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం పని చేస్తానని గణేష్ వెల్లడించారు.
This post was last modified on October 8, 2023 1:55 pm
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…
జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలు ఎంచుకునే అంశం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారం. కార్లను మార్చినట్లు భార్యలను…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొక్క రోజే సమయం ఉండగా.. ఈ టైంలో ప్రముఖ రాజకీయ నాయకులతో సమానంగా సినీ హీరో…
టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. ఆయన…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పలు పొలిటికల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,వ్యూహం,…
140 కోట్ల ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అంటే కత్తి మీద…