Political News

గద్దర్ కుటుంబానికి కాంగ్రెస్ సీటు?

ప్రజా యుద్ధనౌక, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబం నుంచి ఒకరికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనుందా? ఈ మేరకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గద్దర్ కుటుంబం నుంచి ఒకరిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గద్దర్ తనయ వెన్నెలను కంటోన్మెంట్ నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం నిర్ణయించిందని తెలిసింది. ఈ టికెట్ విషయంపై చర్చించిన టీపీసీసీ.. వెన్నెల అభ్యర్థిత్వం గురించి ఏఐసీసీకి చెప్పినట్లు తెలిసింది. దీనికి హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

బతికి ఉన్న చివరి రోజుల్లో గద్దర్ కాంగ్రెస్ మనిషిగా మారిపోయారనే చెప్పాలి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కే ఉందని నమ్మిన ఆయన.. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సభల్లో ప్రత్యేక ఆకర్షణగానూ నిలిచారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆయన మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ గద్దర్ కుటుంబానికి అండగా నిలిచింది. అంత్యక్రియల సమయంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గద్దర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

గద్దర్ కుమారుడు సూర్య గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ లో చేరారు. కానీ గద్దర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆ ఎన్నికల్లో సూర్యకు చివరి నిమిషంలో టికెట్ దక్కకుండా పోయిందని చెప్తారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో సూర్యకు బదులు వెన్నెలను నిలబెడితేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ నమ్ముతుందని తెలిసింది. అందుకే వెన్నెల వైపే హైకమాండ్ మొగ్గు చూపిందని టాక్. కాంగ్రెస్ టికెట్ విషయాన్ని యధుయాష్కి గద్దర్ ఇంటికి వెళ్లి చెప్పినట్లు తెలిసింది.

This post was last modified on October 8, 2023 7:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖైదీ 2 ఇక ఎప్పటికీ రాదేమో

దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…

3 hours ago

అఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…

4 hours ago

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

4 hours ago

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…

5 hours ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

6 hours ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

7 hours ago