Political News

గద్దర్ కుటుంబానికి కాంగ్రెస్ సీటు?

ప్రజా యుద్ధనౌక, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబం నుంచి ఒకరికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనుందా? ఈ మేరకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గద్దర్ కుటుంబం నుంచి ఒకరిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గద్దర్ తనయ వెన్నెలను కంటోన్మెంట్ నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం నిర్ణయించిందని తెలిసింది. ఈ టికెట్ విషయంపై చర్చించిన టీపీసీసీ.. వెన్నెల అభ్యర్థిత్వం గురించి ఏఐసీసీకి చెప్పినట్లు తెలిసింది. దీనికి హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

బతికి ఉన్న చివరి రోజుల్లో గద్దర్ కాంగ్రెస్ మనిషిగా మారిపోయారనే చెప్పాలి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కే ఉందని నమ్మిన ఆయన.. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సభల్లో ప్రత్యేక ఆకర్షణగానూ నిలిచారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆయన మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ గద్దర్ కుటుంబానికి అండగా నిలిచింది. అంత్యక్రియల సమయంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గద్దర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

గద్దర్ కుమారుడు సూర్య గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ లో చేరారు. కానీ గద్దర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆ ఎన్నికల్లో సూర్యకు చివరి నిమిషంలో టికెట్ దక్కకుండా పోయిందని చెప్తారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో సూర్యకు బదులు వెన్నెలను నిలబెడితేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ నమ్ముతుందని తెలిసింది. అందుకే వెన్నెల వైపే హైకమాండ్ మొగ్గు చూపిందని టాక్. కాంగ్రెస్ టికెట్ విషయాన్ని యధుయాష్కి గద్దర్ ఇంటికి వెళ్లి చెప్పినట్లు తెలిసింది.

This post was last modified on October 8, 2023 7:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

6 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

9 hours ago