Political News

‘కాంతితో క్రాంతి’కి లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి పిలుపు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు రాజమండ్రిలో చంద్రబాబుతో లోకేష్ మధ్యాహ్నం మూడు గంటలకు ములాఖత్ కాబోతున్నారు. నారా భువనేశ్వరితో పాటు బ్రాహ్మణితో కలిసి చంద్రబాబుతో లోకేష్ భేటీ కాబోతున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి రాజమండ్రికి లోకేష్ బయలుదేరారు. ఈ సందర్భంగా అడుగడుగునా లోకేష్ కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

అయితే, లోకేష్ వెంట రాజమండ్రి వెళ్లేందుకు కొంతమంది టిడిపి నేతలు ప్రయత్నించారు. కానీ, వారికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే టిడిపి నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. టోల్ గేట్ల దగ్గర లారీలు పెట్టి మరీ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఇక, రాజమండ్రి క్యాంపు సైటు దగ్గరకు కూడా కొంతమందినే పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో, రాజమండ్రి జైలు, లోకేష్ క్యాంపు సైటు దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

మరోవైపు, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమానికి లోకేష్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్, వాహనాల లైట్లు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని లోకేష్ పిలుపునిచ్చారు. బాబుతో నేను అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని, వీధుల్లోకి వచ్చి కొవ్వొత్తులు మొబైల్ టార్చితో వెలుగులు చూపించాలని లోకేష్ అన్నారు. వెలుగులు పంచే చంద్రుడిని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో బంధించారని లోకేష్ మండిపడ్డారు.

ఇక, రాష్ట్రంలో అన్యాయం, అధర్మం రాజ్యమేలుతున్నాయని, ఇవి చీకటికి సంకేతాలని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలోని చీకటిని సూచిస్తుందని చెప్పారు. ఆ చీకటిని తరిమికొట్టాలని కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చామని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

‘‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి… దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి? తెలుగుదేశం పార్టీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దాం’’ అంటూ నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.

Satya

Recent Posts

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…

12 minutes ago

నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణమా..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…

23 minutes ago

కర్ణుడి కాంట్రావర్సి… కల్కి దర్శకుడి కౌంటర్

విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…

1 hour ago

పైరసీని నిలువరించడం సాధ్యమవుతుందా

ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…

2 hours ago

ఆరేళ్ల మనుమరాలితో కారు డ్రైవింగ్… ఎస్ఐ సస్పెండ్

చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…

2 hours ago

ఇది పెళ్లి తెచ్చిన లక్కా…

టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…

2 hours ago