Political News

కాంగ్రెస్ కు ఊపునిచ్చిన సర్వే ?

తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపే వార్తనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మొట్టమొదటి సర్వే రిపోర్టు విడుదలైంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్ది అండ్ కో చెప్పుకుంటున్నారు. ఎలాగు పార్టీ నేతలే కాబట్టి కచ్చితంగా అధికారంలోకి వస్తామనే చెబుతారు. ఇప్పటివరకు జరిగిన చాలా సర్వేల్లో కాంగ్రెస్ రెండో స్ధానంలోనే ఉంటుందని, కాకపోతే గ్రాఫ్ పెంచుకుంటోందని తెలిసింది.

వివిధ కారణాలతో కాంగ్రెస్ గ్రాఫ్ స్ధిరంగా పెరుగుతోందన్న విషయమైతే అర్ధమవుతోంది. అలాంటిది మొదటిసారిగా ‘లోక్ పోల్’ నిర్వహించిన లేటెస్టు సర్వేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కాని తేలింది. ఇదే లోక్ పాల్ కర్నాటక ఎన్నికల్లో చెప్పిన సర్వే ఫలితం నూరుశాతం నిజమైంది కాబట్టి తెలంగాణాలో కూడా అధికారంలోకి రావటం గ్యారెంటీ అని హస్తం పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇంతకీ సర్వేలో ఏమి తేలిందంటే 41-44 శాతం ఓటు షేరుతో 61-67 సీట్ల మధ్య గెలుచుకుంటుందని తేలిందట.

ఇక అధికార బీఆర్ఎస్ 39-42 శాతం ఓట్ల షేరుతో 45-51 మధ్య సీట్లకే పరిమితమవుతుందట. 3-4 శాతం ఓట్లషేరుతో ఎంఐఎం 6-8 సీట్లు గెలుచుకుంటుందని తేలిందట. ఎంఐఎం ఓల్డ్ సిటి అడ్డాగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఎంఐఎంకు బాగా బలమైన ఓల్డ్ సిటీలో కూడా పాగా వేయాలని కాంగ్రెస్ అనుకుంటున్నది. అందుకనే అభ్యర్ధుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నది.

ఇక 10-12 శాతం ఓట్ల షేరుతో బీజేపీ 2 లేదా 3 సీట్లకే పరిమితమవుతుందని తేలింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మ్యాగ్జిమమ్ 3 శాతం ఓట్లు తెచ్చుకుంటుంది అనుకుంటున్న ఎంఐఎం 6-8 సీట్ల మధ్య గెలుచుకుంటుందని తేలటం. అలాగే సగటున 11 శాతం ఓట్ షేర్ సాధిస్తుందని అనుకుంటున్న బీజేపీ మ్యాగ్జిమమ్ 3 సీట్లకే పరిమితమవుతుందని తేలటం. ఇక 3 నుండి 5 శాతం ఓట్లషేరుతో ఇతరులు ఒక్క సీటులో గెలిచే అవకాశముందని తేలిందట. పథకాలు సక్రమంగా అమలు కాకపోవటం, కేసీయార్ వైఖరి, కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్ లాంటి అనేక కారణాలతో కాంగ్రెస్ వైపు జనాలు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో బయటపడిందట.

This post was last modified on October 6, 2023 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

52 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

2 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

3 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago