Political News

ఏపీ రాజకీయం.. ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే

ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంజుగా మారుతోంది. గత నెల రోజుల్లో ఎంత వేగంగా పరిణామాలు మారిపోయాయో తెలిసిందే. కొన్ని నెలల తర్వాత కానీ క్లారిటీ రాదనుకున్న తెలుగుదేశం-జనసేన పొత్తు విషయమై గత నెలలోనే స్పష్టత వచ్చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు అరెస్టు అయిన కొన్ని రోజులకే పవన్ స్వయంగా పొత్తును అధికారికంగా ప్రకటించాడు.

ఐతే పవన్ ప్రకటన అయితే చేశాడు కానీ.. టీడీపీ నాయకులు ఆయనంత ఓపెన్‌గా ఉంటారా.. జనసేనకు బాసటగా నిలుస్తారా.. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. కానీ నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్.. పవన్ విషయంలో చాలా సానుకూలంగా మాట్లాడ్డం.. వారాహి యాత్రకు కూడా మద్దతు ప్రకటించడం.. ఈ యాత్ర సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తలు కలిసి సాగడం.. పవన్ కూడా టీడీపీ విషయంలో మళ్లీ మళ్లీ సానుకూలంగా మాట్లాడడంతో రెండు పార్టీల మధ్య మంచి సమన్వయమే కనిపిస్తోంది.

ఇక ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య అంతరం పెంచడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. వాటిని ఉమ్మడిగా ఎదుర్కోవడం తప్ప వైసీపీకి మరో మార్గం కనిపించడం లేదు. ఇక తేలాల్సిందల్లా బీజేపీ ఎటు వైపు ఉంటుందన్నదే. గత నాలుగేళ్లలో పరిణామాలు గమనిస్తే.. అధికారికంగా పొత్తు జనసేనతో అయినా, వైసీపీకే బీజేపీ ఎక్కువ సహకరించిన సంకేతాలు కనిపించాయి. తమతో పొత్తులో ఉన్న జనసేన.. టీడీపీతో కలిసి సాగాలని నిర్ణయించుకోవడంతో బీజేపీ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. కాగా పవన్ తాజాగా వారాహి యాత్రలో తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పేశాడు. ఇలాంటి పెద్ద నిర్ణయాన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ప్రకటిస్తాడేమో అనుకున్నారు. కానీ పవన్ యాత్రలో.. తన ప్రసంగం మధ్యలో ఈ మాట చెప్పడం చర్చనీయాంశం అయింది. అధికారికంగా ప్రకటన చేసి.. దీన్ని చర్చనీయాంశం చేయడం, అలాగే బీజేపీతో శత్రుత్వం పెంచుకోవడం పవన్‌కు ఇష్టం లేదన్నట్లు కనిపిస్తోంది.

అదే సమయంలో బీజేపీతో కలిసి వెళ్తే మైనారిటీ ఓట్లు పడవన్న భయం కూడా ఉన్నట్లుంది. ఇటీవలి సర్వేల్లో కూడా బీజేపీతో కలిసి వెళ్తే టీడీపీ, జనసేన కూటమికి లాభం కంటే నష్టమే ఎక్కువన్న సంకేతాలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి పవన్ దూరం జరగాలని నిర్ణయించుకున్నాడు. వైసీపీ కూడా అధికారికంగా బీజేపీతో కలిసే పరిస్థితి లేదు. కానీ బీజేపీతో వైసీపీ అనధికారిక బంధంలో ఉన్నట్లు జనం ఇప్పటికే ఫిక్సయిపోయారు. బీజేపీ పట్ల మెతక వైఖరిని కొనసాగిస్తే.. ఎన్నికల్లో ఆ పార్టీకి నష్టం కూడా చేయొచ్చు. ఇక ఏపీలో తేలాల్సిందల్లా వామపక్షాలు ఎవరి వైపు ఉన్నారన్నదే. అది కూడా తేలిపోతే.. ఎన్నికల ముఖచిత్రంపై పూర్తి స్పష్టత వచ్చేసినట్లే.

This post was last modified on October 5, 2023 10:51 pm

Share

Recent Posts

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

3 minutes ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

57 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

4 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

5 hours ago