తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గంలో పదేళ్ళుగా ఎంఎల్ఏగా పనిచేస్తున్నా పెద్దగా యాక్టివ్ గా ఉండరు. పార్టీ కార్యక్రమాల్లో తనకు వీలైనపుడు పాల్గొంటారు లేకపోతే లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీలుంటేనే హాజరవుతారు. దీనికి కారణం ఏమిటంటే ఎక్కువ భాగం సినిమా షూటింగుల్లో ఉండటమే. సినిమాలే బాలయ్యకు ఫుల్ టైం, పాలిటిక్స్ కేవలం పార్ట్ టైమ్ మాత్రమే. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు, రిమాండు నేపథ్యంలో మాత్రమే బాలకృష్ణ పార్టీ నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు.
ఇలాంటి బాలయ్య తెలంగాణా రాజకీయాలలో యాక్టివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మీడియాతో మాట్లాడిన బాలయ్య తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ప్రకటించారు. పార్టీ కోసం తెలంగాణాలో ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు. పోయిన ఎన్నికల్లో నేతలు, క్యాడర్ లో కాస్త భయం, స్థబ్దత ఉన్న మాట వాస్తవమే అని అంగీకరించారు. అయితే వాటిని పోగొట్టినట్లు కూడా చెప్పారు.
కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో తాను విస్తృతంగా ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాలు తమకు రెండు కళ్ళని, తెలంగాణా ఎన్నికల కోసం స్టీరింగ్ కమిటీని కూడా వేసినట్లు చెప్పారు. బాలయ్య తాజా మాటలను చూస్తుంటే తెలంగాణా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని డిసైడ్ అయినట్లు అనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ బాలయ్య ఇలాంటి ప్రకటనలు చేయలేదు. ఇపుడు పనిగట్టుకుని ప్రకటన చేశారంటేనే తమ్ముళ్ళల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
తెలంగాణా ఎన్నికల సమయానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి చంద్రబాబు బయటకు వస్తారా రారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. చంద్రబాబు అందుబాటులో ఉంటే బాలయ్య యాక్టివ్ గా ఉండాల్సిన అవసరంలేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు బాలయ్య నేతలకు రెగ్యాలర్ గా టచ్ లో ఉన్నదిలేదు. అలాంటిది తాను తెలంగాణాలో తిరుగుతానని, ప్రచారం చేస్తానని, పూర్వ వైభవం తీసుకొస్తామని చాలా మాటలు చెప్పటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి తెలంగాణా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సిందే.
This post was last modified on October 5, 2023 3:39 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…