టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉంది…లేదంటే జగన్ అంత ధైర్యంగా చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం లేదు…ఇటువంటి వ్యాఖ్యలు గ్రామాలలోని రచ్చబండలు మొదలు తలపండిన రాజకీయ నాయకులు సైతం చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు, చంద్రబాబు అరెస్టు విధానాన్ని మాత్రమే ఖండించిన ఏపీ బీజేపీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం ఆశీస్సులు లేవని సుజనా చౌదరి క్లారిటీనిచ్చారు. దేశంలో బీజేపీ అతి పెద్ద పార్టీ అని, ఏపీలో బీజేపీకి నష్టం జరుగుతోందన్న ఆవేదన తమకూ ఉందని ఆయన అన్నారు. బీజేపీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత ఆగ్రహంగా ఉన్నారని అంగీకరించారు. చంద్రబాబు కేసు కోర్టులో విచారణలో ఉందని, అందుకే ఎక్కువ స్పందించడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీఐడీ భాగం అని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. బీజేపీ అధిష్టానం చెప్పే అన్ని విషయాలను బయట పెట్టలేమని అన్నారు. ఏపీలో జరుగుతోన్న అరాచకాలతో బీజేపీకి సంబంధం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సుజనా చౌదరి చెప్పారు.
విచారణ సమయంలో ఏ అధికారి అయినా సమాచారాన్ని మీడియాకు ఇవ్వకూడదని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని సుజనా చౌదరి గుర్తు చేశారు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని అన్నారు. ఓ తెలుగు మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on October 4, 2023 9:36 pm
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…