Political News

లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే అప్రూవర్ గా మారడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు మాగుంట రాఘవరెడ్డికి అనుమతిచ్చింది. లిక్కర్ స్కాం లో తాను అప్రూవర్ గా మారాలని అనుకుంటున్నానని అందుకు అనుమతించాలని రాఘవ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కోర్టు అందుకు అనుమతించింది. మాగుంట రాఘవ అంటే ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకన్న విషయం అందరికీ తెలిసిందే.

దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలోనే ఉన్న మాగుంట ఫ్యామిలి మొదటిసారి స్కామ్ లో ఇరుక్కుని అరెస్టయ్యింది. స్కామ్ లో ఎమౌంట్ చిన్నదే అయినా ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల కారణంగా స్కామ్ దేశంలో సంచలనం సృష్టించింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తో పాటు మంత్రి సత్యేంద్ర జైన్ కూడా చాలాకాలంగా జైలులోనే ఉన్నారు. అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు చాలామందిని ఈడీ విచారించి అరెస్టు చేసింది.

ఇదే కేసులో సౌత్ గ్రూప్ తరపున తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా కీలకపాత్ర దారుగా ఈడీ రిమాండు రిపోర్టుతో పాటు చార్జిషీట్లలో కూడా కోర్టుకు చెప్పింది. కవితకు బినామీలుగా ప్రచారంలో ఉన్న రాజన్ పిళ్ళై తదితరులు కూడా అరెస్టయి జైలులోనే ఉన్నారు. స్కామ్ లో చాలామంది పాత్రదారులు ఒక్కొక్కళ్ళుగా అప్రూవర్లుగా మారిపోతున్నారు. ఎంతమంది అరెస్టయినా, ఎంతమంది బెయిల్ తెచ్చుకున్నా, అప్రూవర్లుగా మారినా కవిత పాత్రపైన బాగా వివాదం కంటిన్యూ అవుతోంది.

ఎందుకంటే స్కామ్ లో పాత్రదారులని ఇంతమందిని అరెస్టు చేసిన ఈడీ కవితను నాలుగుసార్లు విచారించినా ఎందుకని అరెస్టు చేయలేదన్నది కీలకమైన పాయింట్. కవిత అరెస్టు తప్పదని విచారణలో బాగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కవిత అరెస్టు ఖాయమని పార్టీ మీటింగులో కేసీయార్ కూడా ప్రకటించారు. అయినా కవిత అరెస్టు ఇంతవరకు జరగలేదు. మరి అప్రూవర్లుగా మారిపోయిన వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా కవితను అరెస్టు చేయాలని ఈడీ అనుకుంటోందా అన్నది అర్ధంకావటం లేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

4 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

6 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

6 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

8 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

11 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

12 hours ago