తెలంగాణా ఎన్నికల్లో 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీచేయాలనే విషయాన్ని ఐదురోజుల క్రితమే డిసైడ్ అయ్యింది. పార్టీ పోటీచేయబోయే నియోజకవర్గాలను పార్టీ తెలంగాణా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణా ఇన్చార్జి శంకరగౌడ్ మీడియాలో ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నియోజకవర్గాలను వీళ్ళు ప్రకటించారు కానీ జనాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది అసలైన పాయింట్. ఎందుకంటే తెలంగాణా జనసేన యాక్టివిటీస్ అసలు లేదు కాబట్టే.
జనసేన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీచేయబోతోంది. పోటీచేయే నియోజకవర్గాలు ఏవంటే కుకట్ పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, మేడ్చల్. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, మథిర, ఇల్లెందు, సత్తుపల్లి, పాలేరులో పోటీచేయబోతోంది. అలాగే వరంగల్ జిల్లాలోని పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు.
నల్గొండ జిల్లాలోని నకిరేకల్, మునుగోడు, హుజూరాబాద్, కోదాడ, మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండం, జగిత్యాల, హుస్నాబాద్, మంథని, ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇప్పటివరకు జనసేన జనాలను తన వైపుకు తిప్పుకోవడానికి చేసిన కృషి ఏమీ లేదు.
తెలంగాణాలో అసలు జనసేన గురించి అనుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. దాదాపు రెండేళ్ల క్రితం వైఎస్సార్టీపీని ఏర్పాటుచేసిన షర్మిల పార్టీ ఉనికి చాటటానికి నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. దీక్షలు చేశారు, ధర్నాలు, నిరసన దీక్షలు చేశారు. 24 గంటలూ కేసీయార్ టార్గెట్ గా ఆరోపణలు, విమర్శలతో హోరెత్తించేస్తున్నారు. ఇంత చేస్తున్న షర్మిల పార్టీనే జనాలు పట్టించుకోలేదు. అలాంటిది సింపుల్ గా జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందంటే జనాలు ఆదరిస్తారా ? బహుశా పవన్ అభిమానులు వరకు పార్టీకి ఓట్లేస్తారేమో అంతే.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…