Political News

కాంగ్రెస్ కి ఊపు తెప్పించే సర్వే

తెలంగాణ తో సహా తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూల పవనాలే వీస్తున్నట్లున్నాయి. తెలంగాణ తో కలిపి చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు జరగాల్సుంది. చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలపై సర్వే సంస్ధలు ప్రీ పోల్ నిర్వహించాయి. పై మూడు రాష్ట్రాల్లో తమ సర్వే వివరాలను సంస్ధలు తాజాగా విడుదల చేశాయి. దాని ప్రకారం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముంది. రాజస్ధాన్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశముందట.

ఇక ఛత్తీస్ ఘడ్ లో అయితే కాంగ్రెస్సే మళ్ళీ అధికారంలోకి వస్తుందని తేలింది. మధ్యప్రదేశ్ లో 230 సీట్లున్నాయి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 116 సీట్లు. ఈటీజీ అనే సంస్ధ చేసిన సర్వేలో బీజేపీ 105-110 మధ్య తెచ్చుకుంటుందట. అలాగే కాంగ్రెస్ 118-128 సీట్లలో గెలిచే అవకాశముందట. పీఇఏసీఎస్ మీడియా 24 అనే సంస్ధ సర్వేలో కూడా ఫైట్ రెండు పార్టీల మధ్య చాలా టైట్ గా ఉంటుందని తేలింది.

90 నీట్లున్న ఛత్తీస్ ఘడ్ లో అధికారంలోకి రావాలంటే 46 సీట్లు తెచ్చుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ 51 సీట్లు తెచ్చుకుంటుందని సర్వేలో తేలింది. బీజేపీ 38 సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి. మీడియా 24 అనే సంస్ధ సర్వేలో కాంగ్రెస్ కు 55-60 సీట్లు వస్తుందని తేలింది. బీజేపీకి 30-35 మధ్య వస్తుందని తేలిందట.

ఇక రాజస్థాన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండబోతోంది. 200 సీట్లున్న రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 101 సీట్లు దాటాలి. ఇక్కడ బీజేపీకి 95-105 స్ధానాలు వచ్చే అవకాశముందట. కాంగ్రెస్ కు 91-101 సీట్ల మధ్య వచ్చే అవకాశముందని తేలింది. అయితే ఏ సంస్ధ కూడా తెలంగాణా, మిజోరం రాష్ట్రాల్లో సర్వేలు చేయలేదు. కారణం ఏమిటంటే కాంగ్రెస్-బీజేపీ ముఖాముఖి పోటీచేసే రాష్ట్రాల్లో మాత్రమే సర్వేలు చేసినట్లు ప్రకటించాయి.

This post was last modified on October 2, 2023 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

1 hour ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

1 hour ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

2 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

2 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

3 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

5 hours ago