Political News

కాంగ్రెస్ కి ఊపు తెప్పించే సర్వే

తెలంగాణ తో సహా తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూల పవనాలే వీస్తున్నట్లున్నాయి. తెలంగాణ తో కలిపి చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు జరగాల్సుంది. చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలపై సర్వే సంస్ధలు ప్రీ పోల్ నిర్వహించాయి. పై మూడు రాష్ట్రాల్లో తమ సర్వే వివరాలను సంస్ధలు తాజాగా విడుదల చేశాయి. దాని ప్రకారం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముంది. రాజస్ధాన్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశముందట.

ఇక ఛత్తీస్ ఘడ్ లో అయితే కాంగ్రెస్సే మళ్ళీ అధికారంలోకి వస్తుందని తేలింది. మధ్యప్రదేశ్ లో 230 సీట్లున్నాయి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 116 సీట్లు. ఈటీజీ అనే సంస్ధ చేసిన సర్వేలో బీజేపీ 105-110 మధ్య తెచ్చుకుంటుందట. అలాగే కాంగ్రెస్ 118-128 సీట్లలో గెలిచే అవకాశముందట. పీఇఏసీఎస్ మీడియా 24 అనే సంస్ధ సర్వేలో కూడా ఫైట్ రెండు పార్టీల మధ్య చాలా టైట్ గా ఉంటుందని తేలింది.

90 నీట్లున్న ఛత్తీస్ ఘడ్ లో అధికారంలోకి రావాలంటే 46 సీట్లు తెచ్చుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ 51 సీట్లు తెచ్చుకుంటుందని సర్వేలో తేలింది. బీజేపీ 38 సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి. మీడియా 24 అనే సంస్ధ సర్వేలో కాంగ్రెస్ కు 55-60 సీట్లు వస్తుందని తేలింది. బీజేపీకి 30-35 మధ్య వస్తుందని తేలిందట.

ఇక రాజస్థాన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండబోతోంది. 200 సీట్లున్న రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 101 సీట్లు దాటాలి. ఇక్కడ బీజేపీకి 95-105 స్ధానాలు వచ్చే అవకాశముందట. కాంగ్రెస్ కు 91-101 సీట్ల మధ్య వచ్చే అవకాశముందని తేలింది. అయితే ఏ సంస్ధ కూడా తెలంగాణా, మిజోరం రాష్ట్రాల్లో సర్వేలు చేయలేదు. కారణం ఏమిటంటే కాంగ్రెస్-బీజేపీ ముఖాముఖి పోటీచేసే రాష్ట్రాల్లో మాత్రమే సర్వేలు చేసినట్లు ప్రకటించాయి.

This post was last modified on October 2, 2023 2:23 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

యంగ్ అండ్ డేరింగ్ ఎంపీ.. హ్యాట్రిక్ ప‌క్కా!

లోక్‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌శ్నించిన నేత‌గా టీడీపీ ఎంపీ…

3 hours ago

రెబ‌ల్ స్టార్ స‌తీమ‌ణి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు విన్న‌పం

రెబ‌ల్ స్టార్, దివంగ‌త కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి అనూహ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజు రాజ‌కీయ ప్ర‌చారం…

6 hours ago

పంతంగి ప్యాక్ అయింది !

సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…

7 hours ago

మీ శ్రేయోభిలాషి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన మ‌రుక్ష‌ణం…

7 hours ago

ఏపీలో ఏం జ‌రుగుతోంది.. నిమ్మ‌గ‌డ్డకు టెన్ష‌న్ ఎందుకు?

ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యేందుకు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ.. ఇంత‌లోనే ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌నే…

7 hours ago

బ్రహ్మరథం బన్నీకా.. వైసీపీకా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. రెండు రోజుల కిందటే…

9 hours ago