Political News

రాస్కో సాంబ – రాబోయేది టీడీపీ-జేఎస్పీ గవర్నమెంటే

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన పార్టీల సంయుక్త ప్రభుత్వం ఏర్పడుతుందని… జనసేన పార్టీ (జెఎస్‌పి) అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. వారాహి యాత్ర నాలుగో విడత యాత్ర లో భాగంగా ఆదివారం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ 2024లో జరిగే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఓటమి ఖాయమని అన్నారు.

టీడీపీతో పొత్తు పెట్టుకుని జేఎస్పీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలి బహిరంగ సభ ఇదే. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న కళ్యాణ్ ఈ విషయాన్ని బీజేపీ పెద్దలతో ఎలాంటి బహిరంగ సమావేశం జరపకుండానే పవన్ టీడీపీతో పొత్తును ప్రకటించారు. బీజేపీ కూడా తమతో జతకడుతుందని ఆశించారు. కానీ ఇప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.

ఇక తాజా ప్రసంగంలో పవన్ మాట్లాడుతూ ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాలన్న వైఎస్సార్‌సీపీ లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, 15 సీట్లకు మించి వైసీపీ గెలవదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తనకు డబ్బు మరియు భూమిపై ఎప్పుడూ ఆసక్తి లేదని అన్నారు. నైతిక ధైర్యంతో రాష్ట్ర భవిష్యత్తు ద్రుష్టిలో ఉంచుకుని జగన్ మోహన్ రెడ్డిపై పోరాడుతున్నానని పేర్కొన్నారు.

గత 10 ఏళ్లలో తమ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిందని, విలువల కోసమే పార్టీని నడుపుతున్నానని పవన్ అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి లేదా అంతకంటే పెద్ద పదవి వచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే తనకు అధికారం కోసం ఆత్రుత లేదని, ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్ర మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని ఉందని ఆయన స్పష్టం చేశారు.

This post was last modified on October 2, 2023 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

2 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

5 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

5 hours ago