Political News

పెద్ద రిలీఫ్ ఇచ్చిన కేజ్రీవాల్

ఇండియా కూటమికి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పెద్ద రిలీఫే ఇచ్చారు. తాను ఇండియాకూటమితోనే ఉంటానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే సీట్ల విషయంలో విభేదాలు రావటంతో కేజ్రీవాల్ కూటమి నుండి బయటకు వెళిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే కూటమికి పెద్ద దెబ్బనే అనుకోవాలి. అయితే జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తాను కూటమిలోనే కంటిన్యు అవుతానని కేజ్రీవాల్ ప్రకటించటంతో కూటమిలోని ఇతర పార్టీలు పెద్ద రిలీఫ్ పీలయ్యాయి.

విషయం ఏమిటంటే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలనే విషయం కీలకం కాబోతోంది. ఎందుకంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించాలంటే వన్ ఆన్ వన్ అనే పద్దతిలో కూటమి తరపున అభ్యర్ధులను పోటీలోకి దించాలని కూటమి అనుకుంటోంది. ఇది కొంచెం కష్టమైనదే అయినా పార్టీలు త్యాగాలకు సిద్ధపడితే ఆచరణ సాధ్యమే. ఇందులో భాగంగానే ఢిల్లీలోని ఏడు సీట్లను కాంగ్రెస్ తమకే వదిలేయాలని ఆప్ అడిగితే కాంగ్రెస్ కాదు పొమ్మన్నది.

అప్పటినుండి ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని కేజ్రీవాల్ మాట్లాడుతూ సీట్ల కేటాయింపు, పోటీ చేయబోయే స్ధానాలను తాను కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతో మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటానని ప్రకటించారు. సీట్ల సర్దుబాటుకు కూటమి తరపున తొందరలోనే ఒక ఫార్ములా రెడీ అవుతోందన్నారు. తనకు ఏ పార్టీతోను విభేదాలు లేవని చిన్న చిన్న విషయాలపై తొందరలోనే సర్దుబాటు చేసుకుంటానని ప్రకటించారు.

నిజంగా కేజ్రీవాల్ నుండి ఇలాంటి ప్రకటనను చాలామంది ఊహించలేదు. ఎందుకంటే అరవింద్ చాలా మొండి మనిషి. తాను అనుకున్నదే జరగాలనే పట్టుదల ఎక్కువ. అలాంటి కేజ్రీవాల్ ఇతర పార్టీలతో సర్దుబాటు చేసుకుంటామని, సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటామని ప్రకటించారంటేనే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కేజ్రీవాల్ తాజా ప్రకటనకు కారణం ఏమిటంటే నరేంద్రమోడీనే అని చెప్పాలి. కేజ్రీవాల్ ను మోడీ లేవకుండా చావకొడుతున్నారు. మోడీని తప్పించుకోవాలంటే బలమైన అండ కేజ్రీకి చాలా అవసరం. అందుకనే పరిస్ధితులకు తగ్గట్లుగా కేజ్రీవాల్ సర్దుకుని వెళుతున్నట్లున్నారు.

This post was last modified on September 30, 2023 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

27 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago