Political News

విశాఖ‌ప‌ట్నం-న‌ర‌సాపురం-క‌డ‌ప‌..వెరీ ఇంట్ర‌స్టింగ్‌ స్టోరీ

అదేంటి? ఏపీలో ఎన్నో న‌గ‌రాలు, నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ఈ మూడు ప్రాంతాల‌నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు అంత స్పెషాలిటీ? ఏంటా ఇంట్ర‌స్టింగ్ అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జ‌మే. మ‌రో ఆరేడు మాసాల్లో జ‌ర‌గ‌బోయే ఏపీ ఎన్నికల నేప‌థ్యంలో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు ప్ర‌ధాన పార్టీల‌కు కీల‌కంగా మారాయి. ఈ మూడు చోట్ల విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ్యూహాల‌పై వ్యూహాలు ప‌న్నింది.

ప్ర‌స్తుతం ఈ వ్యూహాలు నెమ్మ‌దించినా.. ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న అంటూ వ‌స్తే.. ఖ‌చ్చితంగా విశాఖ‌, న‌ర‌సాపురం, క‌డ‌ప పార్ల‌మెంటు స్థానాల‌ను టీడీపీ ద‌క్కించుకోవాల‌నేది ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. వైసీపీ ఈ మూడు చోట్ల చేసిన ఘ‌న కార్యాల‌ను(టీడీపీ నేత‌ల మాట‌ల్లో) ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. ఈ మూడు స్థానాల‌ను తాము ద‌క్కించుకోవాల‌నేది టీడీపీ ప్లాన్‌.

విశాఖ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ వైసీపీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. అయితే.. ఈయ‌న వ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి లేక‌పోగా.. ప్ర‌జ‌ల‌కు కూడా ర‌క్ష‌ణ లేద‌నేది టీడీపీ వాద‌న‌. ఎంపీ కుటుంబ స‌భ్యుల‌ను కిడ్నాప్ చేస్తేనే దిక్కులేని ప‌రిస్తితి ఏర్ప‌డింద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో విశాఖ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ కావాలంటే.. ఇక్క‌డ టీడీపీని గెలిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది ఆ పార్టీ నేత‌ల మాట.

న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఇక్క‌డ విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న స్వ‌ల్ప‌కాలంలోనే పార్టీతో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత‌. ఆయ‌న‌పై కేసు న‌మోదు కావ‌డం.. త‌న‌ను పోలీసులు చిత‌క్కొట్టారంటూ.. ఆయ‌నే స్వ‌యంగా మీడియా ముందు చెప్ప‌డం, కేసులు పెట్ట‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సొంత పార్టీ నాయ‌కుడిని వేధించిన వైసీపీకి యాంటీగా ఇక్క‌డ టీడీపీ ప్ర‌చారం చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీని ఓడించాల‌నేది టీడీపీ ల‌క్ష్యం.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన మూడో నియోజ‌క‌వ‌ర్గం క‌డ‌ప‌. ఇది కూడా వైసీపీ నాయ‌కుడు వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలోనే ఉంది. అయితే.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నం దున.. ఈ ప‌రిణామాల‌ను టీడీపీ నాయ‌కుడు బీటెక్ ర‌వి త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో టీడీపీ జెండా ఎగ‌రేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొత్తంగా 25 పార్లమెంటు స్థానాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఈ మూడు మాత్రం త‌మ ఖాతాలో ప‌డ‌డం ఖాయ‌మ‌నేది టీడీపీ వాద‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on September 29, 2023 12:35 pm

Share
Show comments

Recent Posts

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

2 minutes ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

2 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

2 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

2 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

2 hours ago

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

4 hours ago