స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును ఈ నెల 22వ తేదీకి రిజర్వ్ చేసింది.
మరోవైపు, ఈ క్వాష్ పిటిషన్ తీర్పును బట్టి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇవ్వాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ పై తీర్పు వ్యవహారం సర్వత్రా ఉత్కంఠ రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబు తరఫున లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఏపీ సిఐడి తరఫున వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు చంద్రబాబు లాయర్లు యోచిస్తున్నారని తెలుస్తుంది.
ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబును ఏపీ సీఐడీ 5 రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయిగా ఉండడంతో ఆయననుః విచారణ జరపాలని కోరారు. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 23న జరగనుంది.
This post was last modified on September 22, 2023 4:07 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…