స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును ఈ నెల 22వ తేదీకి రిజర్వ్ చేసింది.
మరోవైపు, ఈ క్వాష్ పిటిషన్ తీర్పును బట్టి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇవ్వాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ పై తీర్పు వ్యవహారం సర్వత్రా ఉత్కంఠ రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబు తరఫున లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఏపీ సిఐడి తరఫున వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు చంద్రబాబు లాయర్లు యోచిస్తున్నారని తెలుస్తుంది.
ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబును ఏపీ సీఐడీ 5 రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయిగా ఉండడంతో ఆయననుః విచారణ జరపాలని కోరారు. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 23న జరగనుంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…