స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును ఈ నెల 22వ తేదీకి రిజర్వ్ చేసింది.
మరోవైపు, ఈ క్వాష్ పిటిషన్ తీర్పును బట్టి చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇవ్వాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ పై తీర్పు వ్యవహారం సర్వత్రా ఉత్కంఠ రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబు తరఫున లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఏపీ సిఐడి తరఫున వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు చంద్రబాబు లాయర్లు యోచిస్తున్నారని తెలుస్తుంది.
ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబును ఏపీ సీఐడీ 5 రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయిగా ఉండడంతో ఆయననుః విచారణ జరపాలని కోరారు. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 23న జరగనుంది.
This post was last modified on September 22, 2023 4:07 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…