టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఆ పిటిషన్ తీర్పు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రకటించాల్సి ఉండగా..సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అయితే, తీవ్ర ఉత్కంఠ తర్వాత రేపు ఉదయం 10.30కు తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండిగ్ లో ఉన్న నేపథ్యంలోనే కస్టడీ పిటిషన్ పై తీర్పులో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
అయితే, కస్టడీ పిటిషన్ కు, క్వాష్ పిటిషన్ కు సంబంధం లేదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారని తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఎపుడు వస్తుంది అన్న విషయంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆరా తీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, తీర్పును మాత్రం ఏపీ హైకోర్టు రిజర్వులో పెట్టింది. రేపు తీర్పు వెలువడే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా ఈ నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇక, అంగళ్లు కేసులో 79 మంది టీడీపీ నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ రాం భూపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది.
This post was last modified on September 21, 2023 8:40 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…