టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఆ పిటిషన్ తీర్పు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రకటించాల్సి ఉండగా..సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అయితే, తీవ్ర ఉత్కంఠ తర్వాత రేపు ఉదయం 10.30కు తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండిగ్ లో ఉన్న నేపథ్యంలోనే కస్టడీ పిటిషన్ పై తీర్పులో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
అయితే, కస్టడీ పిటిషన్ కు, క్వాష్ పిటిషన్ కు సంబంధం లేదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారని తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఎపుడు వస్తుంది అన్న విషయంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆరా తీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, తీర్పును మాత్రం ఏపీ హైకోర్టు రిజర్వులో పెట్టింది. రేపు తీర్పు వెలువడే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా ఈ నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇక, అంగళ్లు కేసులో 79 మంది టీడీపీ నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ రాం భూపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది.
This post was last modified on September 21, 2023 8:40 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…