టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఆ పిటిషన్ తీర్పు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రకటించాల్సి ఉండగా..సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. అయితే, తీవ్ర ఉత్కంఠ తర్వాత రేపు ఉదయం 10.30కు తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండిగ్ లో ఉన్న నేపథ్యంలోనే కస్టడీ పిటిషన్ పై తీర్పులో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
అయితే, కస్టడీ పిటిషన్ కు, క్వాష్ పిటిషన్ కు సంబంధం లేదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారని తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఎపుడు వస్తుంది అన్న విషయంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆరా తీసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, తీర్పును మాత్రం ఏపీ హైకోర్టు రిజర్వులో పెట్టింది. రేపు తీర్పు వెలువడే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా ఈ నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇక, అంగళ్లు కేసులో 79 మంది టీడీపీ నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ రాం భూపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది.
This post was last modified on September 21, 2023 8:40 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…