Political News

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. వైసీపీ లెక్క‌లు ఇవే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము టీడీపీతో క‌లిసి వెళ్తామంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న చేసిన దాదా పు వారం అవుతోంది. ఈ వారం రోజుల్లో జ‌న‌సేన‌లో వ‌చ్చిన మార్పు కంటే.. జ‌న‌సేన నాయ‌కులు చేస్తున్న చ‌ర్చ‌లకంటే కూడా వైసీపీ నాయ‌కులు చేస్తున్న చ‌ర్చ‌లు, వారిలో వ‌చ్చిన మార్పు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని అనుకుంటున్న‌వారు.. కొత్త‌గా సీట్లు ద‌క్కించుకుని విజ‌యం సాధించాల‌ని భావిస్తున్న‌వారు.. వైసీపీలో ఎక్కువ మందే ఉన్నారు.

అయితే.. ఇప్పటి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయం వేరు. ఇప్పుడు మారిన రాజ‌కీయ ముఖ చిత్రం వేరుగా ఉండ‌డం తో వీరంతా కూడా డోలాయ‌మానంలో ప‌డ్డారు. అనేక‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి స‌త్తా ఉంది. బ‌ల‌మైన నియోజక‌వ‌ర్గాలు దాదాపు 80 వ‌ర‌కు టీడీపీ ఖాతాలో ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వీటిలో వైసీపీ స్వ‌ల్ప మెజారిటీతోనే విజ‌యం ద‌క్కించుకుంది. దీనికి కార‌ణం.. ఏ పార్టీకి ఆ పార్టీ వేర్వేరుగా పోటీ చేయ‌డ‌మే. అయితే..ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన చేతులు క‌లిపిన త‌ర్వాత‌.. ఈ ప‌రిస్థితి మారుతుంద‌ని వైసీపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఎంత కాద‌న్నా.. దాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్న‌ది వైసీపీ నేత‌ల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో క‌నిపిస్తున్న, వినిపిస్తున్న‌ విష‌యం. గ‌త ఎన్నిక‌ల్లో ఏదో కొట్టుకు వ‌చ్చినా.. ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి అంత ఈజీకాద‌నేది నిర్మొహ‌మాటంగా వైసీపీ నాయ‌కులు అంగీక‌రిస్తున్న విష‌యంకూడా. ఇక‌, ప‌థ‌కాలు త‌మ‌ను ర‌క్షిస్తాయ‌ని.. ఇన్నాళ్లుగా వైసీపీ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నా.. ఇప్పుడు వైసీపీని మించిన ప‌థ‌కాల‌ను టీడీపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌డం.. గ్రామీణ స్థాయిలో ప్ర‌చారం చేయ‌డంతో త‌మ ప‌థ‌కాలు కూడా త‌మ‌ను కాపాడే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

పొత్తుల‌ను సాధార‌ణంగా తీసుకునే ప‌రిస్థితి లేద‌ని ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల ప్ర‌భావం ఉంటుంది. దీనిని దీటుగా ఎదుర్కొనేందుకు మాకు కూడా వ్యూహాలు కావాలి. ప‌థ‌కాలు, నేత‌ల చ‌రిష్మా.. వంటివి ఈ ద‌ఫా కొంత ప‌నికి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంది. దీనికి మించి ఏం చేయాల‌నేది ఇప్పుడు పార్టీ ఆలోచ‌న చేయాలి. కేవ‌లం ప‌థ‌కాలు మాత్ర‌మే కాపాడ‌తాయ‌ని అనుకుంటే.. టీడీపీ కూడా ప‌థ‌కాలు ప్ర‌క‌టించింది. సో.. ఇవి కాదు.. ఏదో చేయాలి. అంత‌కు మించి ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి“ అని ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి కి చెందిన మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. సో.. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గాల్లో పరిస్థితి.. వైసీపీ నేత‌ల‌ను గుంజాట‌న‌కు దింపింద‌నే చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 20, 2023 11:21 am

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

58 minutes ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

2 hours ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

3 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

4 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago