Political News

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. వైసీపీ లెక్క‌లు ఇవే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము టీడీపీతో క‌లిసి వెళ్తామంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న చేసిన దాదా పు వారం అవుతోంది. ఈ వారం రోజుల్లో జ‌న‌సేన‌లో వ‌చ్చిన మార్పు కంటే.. జ‌న‌సేన నాయ‌కులు చేస్తున్న చ‌ర్చ‌లకంటే కూడా వైసీపీ నాయ‌కులు చేస్తున్న చ‌ర్చ‌లు, వారిలో వ‌చ్చిన మార్పు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని అనుకుంటున్న‌వారు.. కొత్త‌గా సీట్లు ద‌క్కించుకుని విజ‌యం సాధించాల‌ని భావిస్తున్న‌వారు.. వైసీపీలో ఎక్కువ మందే ఉన్నారు.

అయితే.. ఇప్పటి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయం వేరు. ఇప్పుడు మారిన రాజ‌కీయ ముఖ చిత్రం వేరుగా ఉండ‌డం తో వీరంతా కూడా డోలాయ‌మానంలో ప‌డ్డారు. అనేక‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి స‌త్తా ఉంది. బ‌ల‌మైన నియోజక‌వ‌ర్గాలు దాదాపు 80 వ‌ర‌కు టీడీపీ ఖాతాలో ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వీటిలో వైసీపీ స్వ‌ల్ప మెజారిటీతోనే విజ‌యం ద‌క్కించుకుంది. దీనికి కార‌ణం.. ఏ పార్టీకి ఆ పార్టీ వేర్వేరుగా పోటీ చేయ‌డ‌మే. అయితే..ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన చేతులు క‌లిపిన త‌ర్వాత‌.. ఈ ప‌రిస్థితి మారుతుంద‌ని వైసీపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఎంత కాద‌న్నా.. దాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్న‌ది వైసీపీ నేత‌ల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో క‌నిపిస్తున్న, వినిపిస్తున్న‌ విష‌యం. గ‌త ఎన్నిక‌ల్లో ఏదో కొట్టుకు వ‌చ్చినా.. ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి అంత ఈజీకాద‌నేది నిర్మొహ‌మాటంగా వైసీపీ నాయ‌కులు అంగీక‌రిస్తున్న విష‌యంకూడా. ఇక‌, ప‌థ‌కాలు త‌మ‌ను ర‌క్షిస్తాయ‌ని.. ఇన్నాళ్లుగా వైసీపీ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నా.. ఇప్పుడు వైసీపీని మించిన ప‌థ‌కాల‌ను టీడీపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌డం.. గ్రామీణ స్థాయిలో ప్ర‌చారం చేయ‌డంతో త‌మ ప‌థ‌కాలు కూడా త‌మ‌ను కాపాడే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

పొత్తుల‌ను సాధార‌ణంగా తీసుకునే ప‌రిస్థితి లేద‌ని ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల ప్ర‌భావం ఉంటుంది. దీనిని దీటుగా ఎదుర్కొనేందుకు మాకు కూడా వ్యూహాలు కావాలి. ప‌థ‌కాలు, నేత‌ల చ‌రిష్మా.. వంటివి ఈ ద‌ఫా కొంత ప‌నికి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంది. దీనికి మించి ఏం చేయాల‌నేది ఇప్పుడు పార్టీ ఆలోచ‌న చేయాలి. కేవ‌లం ప‌థ‌కాలు మాత్ర‌మే కాపాడ‌తాయ‌ని అనుకుంటే.. టీడీపీ కూడా ప‌థ‌కాలు ప్ర‌క‌టించింది. సో.. ఇవి కాదు.. ఏదో చేయాలి. అంత‌కు మించి ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి“ అని ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి కి చెందిన మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. సో.. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గాల్లో పరిస్థితి.. వైసీపీ నేత‌ల‌ను గుంజాట‌న‌కు దింపింద‌నే చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 20, 2023 11:21 am

Share

Recent Posts

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

4 hours ago

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

11 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

12 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

13 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

18 hours ago