వచ్చే ఎన్నికల్లో తాము టీడీపీతో కలిసి వెళ్తామంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన దాదా పు వారం అవుతోంది. ఈ వారం రోజుల్లో జనసేనలో వచ్చిన మార్పు కంటే.. జనసేన నాయకులు చేస్తున్న చర్చలకంటే కూడా వైసీపీ నాయకులు చేస్తున్న చర్చలు, వారిలో వచ్చిన మార్పు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపాలని అనుకుంటున్నవారు.. కొత్తగా సీట్లు దక్కించుకుని విజయం సాధించాలని భావిస్తున్నవారు.. వైసీపీలో ఎక్కువ మందే ఉన్నారు.
అయితే.. ఇప్పటి వరకు ఉన్న రాజకీయం వేరు. ఇప్పుడు మారిన రాజకీయ ముఖ చిత్రం వేరుగా ఉండడం తో వీరంతా కూడా డోలాయమానంలో పడ్డారు. అనేక నియోజకవర్గాల్లో టీడీపీకి సత్తా ఉంది. బలమైన నియోజకవర్గాలు దాదాపు 80 వరకు టీడీపీ ఖాతాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో వీటిలో వైసీపీ స్వల్ప మెజారిటీతోనే విజయం దక్కించుకుంది. దీనికి కారణం.. ఏ పార్టీకి ఆ పార్టీ వేర్వేరుగా పోటీ చేయడమే. అయితే..ఇప్పుడు టీడీపీ, జనసేన చేతులు కలిపిన తర్వాత.. ఈ పరిస్థితి మారుతుందని వైసీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.
ఎంత కాదన్నా.. దాదాపు 70 నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నది వైసీపీ నేతల అంతర్గత చర్చల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న విషయం. గత ఎన్నికల్లో ఏదో కొట్టుకు వచ్చినా.. ఇప్పుడు మాత్రం పరిస్థితి అంత ఈజీకాదనేది నిర్మొహమాటంగా వైసీపీ నాయకులు అంగీకరిస్తున్న విషయంకూడా. ఇక, పథకాలు తమను రక్షిస్తాయని.. ఇన్నాళ్లుగా వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకున్నా.. ఇప్పుడు వైసీపీని మించిన పథకాలను టీడీపీ ఇప్పటికే ప్రకటించడం.. గ్రామీణ స్థాయిలో ప్రచారం చేయడంతో తమ పథకాలు కూడా తమను కాపాడే పరిస్థితి లేదని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
పొత్తులను సాధారణంగా తీసుకునే పరిస్థితి లేదని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల ప్రభావం ఉంటుంది. దీనిని దీటుగా ఎదుర్కొనేందుకు మాకు కూడా వ్యూహాలు కావాలి. పథకాలు, నేతల చరిష్మా.. వంటివి ఈ దఫా కొంత పనికి వచ్చే అవకాశం తక్కువగా ఉంది. దీనికి మించి ఏం చేయాలనేది ఇప్పుడు పార్టీ ఆలోచన చేయాలి. కేవలం పథకాలు మాత్రమే కాపాడతాయని అనుకుంటే.. టీడీపీ కూడా పథకాలు ప్రకటించింది. సో.. ఇవి కాదు.. ఏదో చేయాలి. అంతకు మించి ప్రజలకు చేరువ కావాలి“ అని ఉమ్మడి పశ్చిమ గోదావరి కి చెందిన మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. సో.. దీనిని బట్టి పవన్ ప్రకటన తర్వాత.. నియోజకవర్గాల్లో పరిస్థితి.. వైసీపీ నేతలను గుంజాటనకు దింపిందనే చెబుతున్నారు పరిశీలకులు.
This post was last modified on September 20, 2023 11:21 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…