Political News

జ‌న‌సేన‌కు ‘గ్లాసే’.. ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న‌

జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల గుర్తుగా గ్లాసునే కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న చేసింది. కొన్ని నెల‌ల కింద‌ట దేశ‌వ్యాప్తంగా ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు ఉన్న ఓట్ల‌ను.. సీట్ల‌ను.. గుర్తింపు వంటి అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయా పార్టీలగుర్తుల‌ను ర‌ద్దు చేసింది. ఇలా.. జ‌న‌సేన కూడా అప్ప‌ట్లో త‌న‌కు ఉన్న గ్లాస్ గుర్తును కోల్పోయింది. దీంతో అప్ప‌ట్లో రాజ‌కీయంగా జ‌నసేన‌పై ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అయితే.. తాజాగా ఏపీ స‌హా తెలంగాణ‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో పార్టీల ఎన్నిక‌ల గుర్తుల‌ను కేటాయిస్తూ.. ఎన్నిక‌ల సంఘం తాజాగా నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించింది. 2018లో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో(కొన్ని స్థానాల్లో)నూ.. 2019లో జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన అభ్య‌ర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. తెలంగాణ‌లో అభ్య‌ర్థులు ఓడిపోగా ఏపీలో ఒక్క సీటు ను మాత్ర‌మే జ‌న‌సేన ద‌క్కించుకుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జనసేన మళ్లీ పోటీకి సిద్ధమైంది. రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. జనసేన పార్టీ తరఫున పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘంనిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. వైసీపీ ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతుందంటూ.. జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌శ్నించారు. రాజ‌కీయాల్లో వాస్త‌వాలు తెలుసుకుని వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌న‌సేన నాయ‌కులు సూచించారు.

This post was last modified on September 19, 2023 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago