Political News

మూడు సీట్లపై జనసేన కన్నేసిందా ?

రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్న జనసేన పెద్ద ప్లానులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పట్టుదలగా ఉందట. రాజంపేట, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లోని నేతలు మహా ఉత్సాహంగా ఉన్నారట పోటీ విషయంలో. పార్టీ తరపున అంతర్గతంగా కూడా నేతలు, క్యాడర్ సమావేశాలు పెట్టుకుని తమ పార్టీనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతోందని చెప్పేసుకుంటున్నారు. మామూలుగా అయితే జనసేన గెలుపు కష్టమని కాకపోతే టీడీపీతో పొత్తుంటుంది కాబట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని చెప్పేసుకుంటున్నారని సమాచారం.

ఈ మూడు నియోజకవర్గాలపై జనసేన ప్రధానంగా కన్నేయటానికి కారణం ఏమిటంటే బలిజ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమే. రాయలసీమలో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే మిగిలిన వాటితో పోల్చినపుడు బలిజల జనాభా చాలా ఎక్కువ. జనసేన తరపున బలిజ సామాజికవర్గం నేతలను పోటీలోకి దింపితే గెలుపు ఖాయమని లోకల్ లీడర్లు లెక్కలేసుకుంటున్నారు. అయితే బలిజ సామాజిక వర్గంతో పాటు ఇతరులు కూడా పోటీపై ఆసక్తి చూపుతున్నారు.

పార్టీలో యాక్టివ్ గా ఉంటు పోటీ విషయంలో బాగా ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసిన శ్రీనివాసరాజు రాజంపేటలో పోటీకి రెడీగా ఉన్నారు. ఇదే సమయంలో బలిజ యువనేత దినేష్ కూడా టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. చాలాకాలంగా రాజంపేట నియోజకవర్గంలో దినేష్ చురుగ్గా ఉంటున్నారు. బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్ధానమే అయినా పోటీకి జనసేన రెడీ అంటోంది.

గతంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన విజయజ్యోతి ప్రస్తుతం జనసేనలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఈమెకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. ఇక మైదుకూరులో అయితే టీడీపీ ఇన్చార్జి సుధాకర్ యాదవ్ కు టికెట్ ఖాయమని అనుకుంటున్నారు. అయితే తమకు పోటీచేసే అవకాశం ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ పై ఒక తీర్మానం చేసి అధినేత పవన్ కల్యాణ్ కు పంపారు. మరి పొత్తులో మైదుకూరు సీటును పవన్ పార్టీకి అడుగుతారా ? చంద్రబాబు ఎలా రియాక్టవుతారు అనేది ఆసక్తిగా మారింది.

This post was last modified on September 19, 2023 2:31 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

13 mins ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

1 hour ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

3 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

4 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

4 hours ago

తాడిప‌త్రిలో ఉండొద్దు.. జేసీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన పోలీసులు

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రిలో ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర హింస చెల‌రేగింది. ఇక్క‌డ పోటీలో ఉన్న జేసీ…

10 hours ago